Hyderabad Weather: తెలంగాణలో భానుడి భగభగ: పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’.. నిప్పుల కొలిమిలా మారనున్న రాష్ట్రం!

Hyderabad Weather: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. వేసవి ప్రారంభంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రానున్న రెండు రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తూ హైదరాబాద్ వాతావరణ కేంద్రం అత్యంత కీలకమైన ప్రకటన విడుదల చేసింది.

8 జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా కింది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మేడ్చల్ మల్కాజ్‌గిరి మరియు హైదరాబాద్.

ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41°C నుండి 44°C వరకు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు వాతావరణ కేంద్రం.

మూడు రోజుల పాటు వడగాలుల ముప్పు ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రతలు మరో 1 నుండి 2 డిగ్రీల వరకు పెరిగే ఛాన్స్ ఉంది. నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలుల ప్రభావం అత్యధికంగా ఉండనుందన్నారు.

ప్రజలు ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరిగా తెసుకోవాలి అని హేచరించారు, పెరుగుతున్న ఎండల దృష్ట్యా వైద్య నిపుణులు ప్రజలకు వాతావరణ కేంద్రం పలు సూచనలు చేస్తున్నారు.

మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా గొడుగు, టోపీ లేదా తలపాగా ధరించాలి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి మంచినీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ (ORS) వంటివి ఎక్కువగా తీసుకోవాలి. వృద్ధులు, గర్భిణులు మరియు చిన్నపిల్లల విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి అని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

తెలంగాణ ప్రభుత్వం కూడా ఎండల తీవ్రత దృష్ట్యా జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఉపాధి హామీ కూలీల పని వేళల్లో మార్పులు చేయడంతో పాటు, బహిరంగ ప్రదేశాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారి చేసింది కావున ప్రజలు జాగ్రత్త వహించాలి.

Nivetha Pethuraj DELETES Pictures Of Fiance Rajhith Ibran From Her Social Media | Telugu Rajyam