ఏపీ అసెంబ్లీ నుండి 11 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్న 11 మంది ఎమ్మెల్యేలను ఒక్కరోజు సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రతిపాదన మేరకు నిమ్మకాలయ చినరాజప్ప, బెందాళం అశోక్, ఆదిరెడ్డి భవాని, గద్దె రామ్మోహన్, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్, వి.రామకృష్ణబాబు, గణబాబు, వి.జోగేశ్వరరావు, ఎం.రామరాజును స్పీకర్ తమ్మినేని సీతారాంను సస్పెండ్ చేశారు.