ప్రియుడి చేతిలో మోసపోయిన యువతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న సూసైడ్ సెల్ఫీ వీడియో!

ప్రస్తుత కాలంలో ఎంతో మంది యువతీ యువకులు ప్రేమ వ్యామోహంలో పడి తమ జీవితాలను క్షణికావేశంలో నాశనం చేసుకుంటున్నారు. ఎంతోమంది ప్రేమలో ఉంది వారి ప్రేమను బ్రతికించుకోగా మరి కొంతమంది ప్రేమలో ఫెయిల్ అవుతూ ప్రాణాలు తీసుకుంటున్న వారు ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని మనస్థాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరినీ కలిసివేస్తుంది.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన తేజశ్రీ అనే యువతి రాజ్ కుమార్ అనే యువకుడితో గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉంది. రాజ్ కుమార్ తానే తన సర్వస్వం అంటూ ఆమెకు మాయ మాటలు చెప్పి తనని ప్రేమలోదించారు.ఇలా కొంతకాలం పాటు ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట పెళ్లి చేసుకోవాలని భావించారు ఈ క్రమంలోనే పెళ్లి చేసుకోవాలని తేజ శ్రీ రాజ్ కుమార్ కు చెప్పగా రాజ్ కుమార్ మాత్రం పెళ్లి మాట వచ్చేసరికి తనని దూరం పెడుతున్నారు.

ఈ క్రమంలోనే తన ప్రియుడు తనని మోసం చేస్తున్నాడని తెలుసుకున్న ఈమె తనతో గట్టిగా వాదించింది అయితే తాను పెళ్లి చేసుకోనని చెప్పడంతో తీవ్రమనస్థాపానికి గురైన తేజశ్రీ చావే శరణ్యమని భావించింది. ఈ క్రమంలోనే సెల్ఫీ వీడియోతో తాను ప్రేమలో ఓడిపోయానని.. తానే సర్వస్వం అన్నటువంటి రాజ్ కుమార్ తనని మోసం చేశాడని,నువ్వే నన్ను మోసం చేస్తే నాకు ఎవరి దిక్కు అంటూ ఈమె తన బాధను వీడియో రూపంలో బయట పెట్టే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.