టిఆర్ఎస్ మల్కాజ్ గిరి ఎంపి, ప్రస్తుత మేడ్చల్ టిఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డికి దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఆ షాక్ ఏదో బయటి పార్టీల నుంచో లేదంటే బయటి పార్టీల నేతల నుంచో లేక కామన్ పీపుల్ నుంచో కాదు ఏకంగా సొంత పార్టీ నేతల నుంచే షాక్ తగిలింది. సొంత పార్టీ నుంచే అంతగా ఆయనకు ఎదురైన చేదు అనుభవం ఏంటి? అసలేమైంది? వివరాలు చదవండి. వీడియో చూడండి.

గత 2014 ఎన్నికల్లో మల్లారెడ్డి టిడిపి తరుపున పోటీ చేసి మల్కాజ్ గిరి ఎంపీ స్థానంలో గెలుపొందారు. టిడిపి, బిజెపి పొత్తులో భాగంగా గెలిచిన ఏకైక టిడిపి ఎంపీ మల్లారెడ్డే. అయితే ఆయన బంగారు తెలంగాణ సాధించే లక్ష్యంతో టిడిపికి గుడ్ బై చెప్పి టిఆర్ఎస్ లో చేరిపోయారు. ఇక ఇప్పటి వరకు బండి బాగానే నడిచింది.

కానీ 2018 ముందస్తు ఎన్నికల్లో మల్లారెడ్డిని మేడ్చల్ నియోజకవర్గంలో బరిలోకి దింపారు కేసిఆర్. మల్లారెడ్డి సీిరియస్ గానే పనిచేస్తూ ఉన్నారు. ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. అయితే పార్టీలో అంతర్గత విబేధాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. దీంతో స్థానిక టిఆర్ఎస్ నేతలు కొందరు సోమవారం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు. పార్టీ ఆఫీసులో ఉన్న ఫ్లెక్సీలు చింపి పారేశారు.

వారు ఎందుకు అంతగా కోపగించుకున్నారన్నది చర్చనీయాంశమైంది. అంతర్గత విబేధాల కారణంగానే పార్టీ ఎలక్షన్ ఆఫీసు మీద కార్యకర్తలు దాడి చేసి ఫ్లెక్సీలు చింపినట్లు తెలుస్తోది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కార్యకర్తలు ఎంతగా ఆగ్రహం వ్యక్తం చేసి ఫ్లెక్సీలు చింపి పారేస్తున్నారో కింద వీడియోలో చూడండి.
