రోడ్డు ప్రమాదంలో వనజీవి రామయ్యకు గాయాలు

పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఖమ్మంకి చెందిన రామయ్య నేడు కస్పా బజారు నుంచి బస్టాండ్ వైపు తన ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఆయన నగరపాలక కార్యాలయం సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో బ్రేక్ వేయడంతో ఒక్కసారిగా వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆయన చేతికి గాయాలవడంతో స్థానికులు 108 సాయంతో ఆసుపత్రికి తరలించారు.