మంత్రి జూపల్లి కృష్ణారావును ఘోరావ్ చేసిన ప్రజలు (వీడియోలు)

మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రచారం నిర్వహిస్తుండగా కొప్పునూరు గ్రామ మాలలు అడ్డుకొని నిలదీశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని కొప్పునూర్ లో జూపల్లి కృష్ణారావు ప్రచారం చేయడానికి రాగా దళితులకు ఇస్తామన్న మూడెకరాల భూమి ఏమైందని వారు ప్రశ్నించారు. 10 మందికి 3 ఎకరాల భూమి కేటాయించినట్టు కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారని ఆ తర్వాత అది అమలు కాలేదన్నారు.

ఈ విషయమై కలెక్టర్ ను ప్రశ్నించగా మంత్రిని అడగాలని చెప్పారన్నారు. మీరే అడ్డుకున్నారంటూ గ్రామస్థులు నిలదీశారు.  దీంతో జూపల్లి వారితో కలిసి చర్చించారు. చర్చలో కూడా గ్రామస్థులు ప్రశ్నలు వేయడంతో జూపల్ల సమాధానం చెప్పలేకపోయారు. జూపల్లిని నిలదీసిన వీడియోలు కింద ఉన్నాయి చూడండి.     

 

jupally1

 

jupally2