బండి సంజయ్‌కి కేటీఆర్‌ సవాల్..

బండి సంజయ్‌కి మంత్రి కేటీఆర్‌ సవాల్ విసిరారు. దమ్ముంటే మంత్రి గంగుల కమలాకర్‌పై గెలువాలని బండి సంజయ్‌పై తీవ్రంగా విమర్శించారు కేటీఆర్. ప్రస్తుతం కరీంనగర్‌లో పర్యటిస్తున్న కేటీఆర్.. కార్పొరేషన్‌ పరిధిలో 410 కోట్లతో చేపట్టే మానేరు రివర్‌ ఫ్రంట్‌ పనులను, నగరంలో ప్రతి రోజు మంచి నీటి సరఫరా పథకానికి సంబంధించిన ఫైలాన్‌ను మంత్రి ఆవిష్కరించారు. తర్వాత స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో బీజేపీ కార్పొరేటర్లను గులాబీ కండువా కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని బండి సంజయ్‌ ఎనాడైనా అడిగారా? నేతన్నల కోసం క్లస్టర్ అయినా తెప్పించారా? అంటూ కరీంనగర్‌ ఎంపీని ప్రశ్నించారు.