నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన టిఆర్ఎస్ ఆశీర్వాద సభలో కేసిఆర్ రెచ్చిపోయారు. చంద్రబాబును మరింత కసిగా, కరుకుగా ఘాటైన పదాలతో, ముత్క మాటలతో ఉతికి ఆరేశారు. నిన్న నిజామాబాద్ సభలో తిట్టిన దానికంటే రెండాకులు ఎక్కువే తిట్టారు. చంద్రబాబును ఉద్దేశించి గలీజు కూతలు అందుకున్నారు. రాజకీయాల్లో కొత్త రకం తిట్టను కనిపెట్టి మరీ చంద్రబాబు మీద ప్రయోగించారు కేసిఆర్. సభలో ఆయన బాబును ఉద్దేశించి ఏం మాట్లాడారో కింద యదాతదంగా ఉంది చదవండి.
కుట్రలలో కొత్త కుట్ర. సిగ్గు లేకుండా శరం లేకుండా పౌరుషం లేకుండా, హీనాతి హీనంగా చంద్రబాబునాయుడును తోల్కొస్తరట. వీళ్ల చిల్లర రాజకీయం కోసం చంద్రబాబునాయుడును తోల్కొచ్చి ఆయనకున్న ఆఫ్ పర్సెంటో, జీరో పర్సెంటో ఓట్లతోటి గట్టెక్కుతారట.
చంద్రబాబు నాయుడు విజయవాడలో ఇంకో మాట మాట్లాడిండు. అదో తమాష. మనిద్దరం ఒక్కటైదాం. మనకు ఢిల్లీలో పతార ఉంటదని చెప్పిన. కేసిఆర్ నా ఎంబడి రాలేదు. అందుకే మహా కూటమి వచ్చింది అంటడు.చంద్రబాబు ఏమంటడు. తెలుగోళ్లు ఒక్కటి అని నేను కేసిఆర్ కు చెప్పిన. నా మాట కేసిఆర్ వినలేదు. నా ఎమ్మటి రాలేదు. అందుకే మహా కూటమి వచ్చింది అంటడు. అది మహాకూటమా? కాలకూట విషమా? అది మహా కూటమా? నీ బొంద కూటమా?
చంద్రబాబునాయుడు ఇంకో మాట మాట్లాడతుండు. సిగ్గులేకుండా మాట్లాడుగుండు. నరేంద్ర మోడీ, కేసిఆర్ ఒక్కటైపోయిర్రు అంటుండు. ఆ మాట అంటానికి కొద్దగా అన్న సిగ్గుండాలె కదా? నాగుగేండ్లు నరేంద్ర మోడీ సంకలో ఉన్నావు కదా? నాలుగేండ్లు నరేంద్ర మోడీ సంక నాకితివి కదా?నాలుగేండ్లు నరేంద్ర మోడీ కాళ్లు మొక్కినవు కదా? నా 7 మండలాలు గుంజుకున్నవు. నరేంద్ర మోడీని అడ్డం పెట్టుకుని కదా నా సీలేరు పవర్ ప్రాజెక్టు గుంజుకున్నవు. నరేంద్ర మోడీని అడ్డం పెట్టుకుని కదా నా హైకోర్టు విభజన కానీయలేదు. ఇవి వాస్తవాలు కావు. నిజాలు కాదు.
నీ నంగనాచి మాటలు, నీకు డబ్బా కొట్టే ఒకటి, రెండు మీడియా సంస్ డ్డం పెట్టుకుని మాట్లాడుతున్నవా. ఏదైనా చేయగలుగుతా అంటే చంద్రబాబునాయుడూ మాతో గెలుక్కున్నవు జాగ్రత్త. తెలంగాణ దెబ్బ ఏందో తెలిస్తే ఎగిరి విజయవాడ కరకట్ట మీద పడ్డవు. మేము నీ తెరువు రాలేదు. మాకు 119 ఉంటే నీకు 175 ఉన్నయి. అక్కడ చూసుకో. ఆడ సక్కగ లేదు నీ కథ. ఆగమాగం ఉన్నది. ఈడ దుఖాణం తెరుస్తా అంటున్నవు బిడ్డా. నేను దబక్కున మూడో కన్ను తెరిస్తే నీ గతి ఏమైతదో ఆలోచించుకో.
తెలుగు వాళ్లు అంతా ఒక్కటే అంటున్నవు. నీ తెలుగు పేరు చెప్పి మా కొంప ఆరిస్తిరి. తెలుగు సెంటిమెంట్ మా కొంప ముంచింది. మల్లా నువ్వు వస్తావా? తెలంగాణకు. సిగ్గులేదా ఆ మాట అనేందుకు. చంద్రబాబు పేరు చెబితే తెలంగాణలో దొడ్లె కట్టేసిన బర్లు కూడా తాళ్లు తెంపుకోని పారిపోతయి. అంత దుర్మార్గమైన కాలు నీది. నీతో కలుస్తానికి మాకు సిగ్గు లేదా ఇంకా? భూటకపు ఎన్ కౌంటర్ల లో నువ్వు కాల్చి చంపిన మా యువకుల ఆత్మలు ఇంకా ఘోషిస్తున్నయ్.
నువ్వు కాల్చి చంపినవు. అటువంటి తెలుగుదేశం పార్టీతోని నిస్సిగ్గుగా పొత్తు పెట్టుకుంటున్నరు కాంగ్రెస్ నాయకులు. నేను ఎవ్వలితో రాజీ పడలేదు. సావు నోట్లో తలకాయ పెట్టి సాధించిన తెలంగాణను మల్లా విజయవాడ చేతిలో పెట్టాల్నా? రేపు దరఖాస్తు పట్టుకుని అమరావతి పోవాల్నా రేపు మనం. హైదరాబాద్ పోవాల్నా? చైతన్యం కలిగిన జిల్లా తీర్పు చెప్పాలె.
దబ్బున ఈ దుర్మార్గులు అధికారంలోకి వచ్చి చంద్రబాబునాయుడుకు 15 ఎమ్మెల్యే సీట్లు వస్తే డిండి ప్రాజెక్టు కట్టనిస్తడా? మనకు నీళ్లు రానిస్తడా? మీ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతరా? దయచేసి ఆలోచించాలి అని కోరుతున్న. చంద్రబాబునాయుడు ఏం మాట్లాడిండు. రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కటి చేస్తా అన్నడు. చంద్రబాబు నమ్మదగినన వ్యక్తి కాదు. నయవంచకుడు చంద్రబాబునాయుడు. బొడ్లో కత్తి పెట్టుకుని తిరుగుతున్నడు. ఏ మోఖా దొరికినా పొడిచి పారేస్తడు. తెలంగాణ మేధావులు ఆలోచించాలె. దయచేసి ఈ కుట్రను తిప్పికొట్టాలె.
నేను సావు నోట్లు తల పెట్టి తెలంగాణ సాధించిన ఎన్ని ఆటంకాలు వచ్చినా వెనకకు పోలే. దీక్ష చేస్తప్పుడు చచ్చిపోతావు కేసిఆర్ అని డాక్టర్లు చెప్పినా నేను వినలేదు. సావు నోట్లోకి పోయి తెచ్చిన తెలంగాణను మల్లా విజయవాడకు అప్పజెప్తరా?
