నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కాంగ్రెస్ మీద నిప్పులు చెరిగారు. ఉద్యమ కాలంలో మాదిరిగానే ఇప్పుడు కూడా బూపు పురాణం అందుకున్నరు. ఇక టిడిపి అధినేత చంద్రబాబు ను ఉద్దేశించి మరింత ఘాటుగా రెచ్చిపోయారు. చంద్రబాబు దొంగ, తెలంగాణ ద్రోహి అంటూ విరుచుకుపడ్డారు. అటువంట ిఅడ్డమైన దొంగతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటదా అని నిలదీశారు. గబ్బు మాటలు తిడుతూ తిట్ల పంచాంగం అందుకున్నరు. థూ.. మీ మొఖం పాడుగాను అంటూ గలీజు మాటలు తిట్టారు. కాంగ్రెస్, టిడిపి పొత్తుపై కేసిఆర్ ప్రసంగంలో భయంతో కూడిన ఆక్రోశం కనిపించింది. సభలో కేసిఆర్ ఏం మాట్లాడిండో కింద చదవండి.
నాలుగున్నరేళ్ల పాలనలో 452 పథకాలు చేపట్టినం. మేనిఫెస్టోలో చెప్పినవి. చెప్పనివి కూడా అమలు చేసినం. మనం పెట్టిన పథకాలు చదివితే తెల్లార్తది. బిడి కార్మికులకు దుఖం ఉన్నది. బిడీలు చుడితే బీమార్లు వస్తయి. అందుకే వారందరికీ నేను ఫించన్లు ఇస్తున్నాను.
పోచారం శీనన్న గురించి చెప్పాలె. పోచారం శీనన్న గురించి చెప్పాలె. పోచారం శ్రీనివాసరెడ్డి పేరు ఆయనది. కానీ కేసిఆర్ పెట్టిన పేరు లక్ష్మీ పుత్రుడు. పోచారం నిఖార్సైన రైతు బిడ్డ. వ్యవసాయ శాఖ తీసుకున్నప్పటి నుంచి ఇండియాలో ఎక్కడా లేని మేలు రైతులకు జరుగుతున్నది. గత ప్రభుత్వాలు లాఠీఛార్జి చేస్తే టిఆర్ఎస్ సర్కారు వచ్చిన రెండు నెలల్లోనే 10కోట్లు సబ్సిడీ ఇచ్చి ఎర్రజొన్న రైతులను ఆదుకున్న విషయం మీ అందరికీ తెలుసు.
అంతకుముందు వ్యవసాయ శాఖను మొత్తం నాశనం చేశారు. కేవలం 600 మంది ఉండేవాళ్లు. ఐదు వేల ఎకరాలకు ఒక ఎక్సటెన్ష్ ఆఫీసర్ ఉండాలె. దాని కోసం 2638 మంది ఎఇఓ లను నియమించాము. ఆరోజు ఆత్మహత్య చేసుకుంటే 6 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించినాము. నిజాం కాలంలో తర్వాత భూరికార్డుల ప్రక్షాళన చేసింది మనమే. రైతుబంధు దేశంలోనే, ప్రపంచంలోనే ఎక్కడా లేని రీతిలో అమలు జరుపుతున్నాం.
కాంగ్రెస్ పార్టీ సిగ్గు పడాలె. అల్ రెడీ స్కీం స్టార్ట్ అయింది. ఒక వరుస చెక్ లు అందించాము. రెండో వరుస చెక్కులు రెడీగా ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్లు కోర్టులో కేసు వేశారు. కాంగ్రెస్ వాళ్లకు సిగ్గు ఉండాలె. సిగ్గు పడాలె. వాళ్ల బతుకే కేసు. నిలబడ్తే కేసు, ఊ అంటే కేసు, ఉచ్చ పోస్తే కేసు. సొల్లు పురాణం మాట్లాడితే నాకు తిక్క రేగింది. నేను చెప్పిన. ఎందుకురా ఎన్నికలకు పోదామా? అంటే ఆ రెడీ అన్నరు. ఇప్పుడు గోడలు గీకుతున్నారు. సుప్రీంకోర్టులో కేసు, ఎలక్షన్ కమీషన్ లో కేసు వేశారు. ప్రజల దగ్గరకే పోదాం పా అన్నాను.
ఎవరు త్యాగం చేయలేదు. టిఆర్ఎస్ పార్టీకి పదవులు అంటే ఎడమ కాలు చెప్పులా విసిరేసినం. రాష్ట్రం గట్టిగా ముందుకు పోవాలె. తెలంగాణ వస్తే ఆగమైతదన్నారు. బిచ్చమెత్తుకుంటామన్నారు. కరంటు ఉండదు చీకట్లు కమ్ముకుంటాయని ఒకాయన అన్నడు. రైతులకు పెట్టుబడి ఇచ్చే రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే. గాచారం బాగాలేక చచ్చిపోతే 5 లక్షలు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ మాత్రమే. కడుపు కట్టుకుని, నోరు కట్టుకుని అవినీతి లేకుండా పనిచేసిన కారణంగా దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 స్థానంలో ఉంది. 17.01 పర్సెంట్ మన ఆర్థిక ప్రగతి.
ఇసుక మీద ఆదాయం వస్తది ప్రభుత్వానికి. తెలంగాణ రాకముందు పది సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఇసుక మీద వచ్చిన ఆదాయం తొమ్మిదిన్నర కోట్లు. నాలుగేండ్లే అయింది ఇప్పుడు 1977 కోట్లు. ఆనాడు దొంగల్లాగ మీరు దోసుకుని తిన్నరు. మేము అవినీతి బందు పెట్టి పైసా పైసా ప్రభుత్వ ఖజానాకు వచ్చేలా చేస్తే రైతులకు కరెంటు ఇస్తున్నం. చిన్న ఉద్యోగులకు జీతాలు పెంచినం. అంగన్ వాడీలను ఒకడు గుర్రాలతో తొక్కించిండు, ఇంకోడు వెట్టి చాకిరి చేయించిండు. వారందరికీ మేము జీతాలు పెంచినం. ఎంతో మంది చిన్న ఉద్యోగులు అర్ధాకలితో పనిచేశారు.
వారంతా మీరు టిఆర్ఎస్ ను ఆశీర్వదించండి. గెలిపించండి. మీయెక్క జీతాలు మళ్లీ పెంచే ప్రయత్నం చేస్తామని చెబుతున్నాను. ఐదు గుంటలు భూమి ఉన్న రైతు చనిపోతే కూడా ఐదు లక్షలు వస్తయి. ఇయ్యాల ఫెర్టిలైజర్ కష్టాలు ఉన్నయా? గోదాములు కట్టుకున్నాం. ఆనాడు 4 లక్షలే ఉండే. ఇప్పుడు 23 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములు కట్టుకున్నాం.
భారత దేశంలో వ్యవసాయ ట్రాక్టర్లక పన్ను రద్దు చేసిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. గత ప్రభుత్వాలు నీటి తీరువాను రద్దు చేసిన సర్కారు టిఆర్ఎస్ పార్టీనే. మార్కెట్ కమిటీలలలో అన్ని మతాలకు, కులాలకు ప్రాతినిథ్యం రావాలని రిజర్వేషన్లు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ. రైతు సమన్వయ సమితి సభ్యులకు కూడా మేనిఫెస్టోలో నెలవారీ వేతనాలు ప్రకటిస్తాము. కోెటి ఎకరాలకు సాగునీరు ఇచ్చే శపథం తీసుకున్నడు కేసిఆర్. కోటి ఎకరాలకు నీరు రావాల్సిందే. శ్రీరాం సాగర్ పునరుజ్జీవ పథకం అయితేనేమీ, పాలమూరు ఎత్తిపోతల అయితేనేమీ, సీతారామా ప్రాజెక్టు అయితేనేమీ.
ఎల్లంపల్లి, గోదావరి నుంచి ఉల్టా నీళ్లు తెచ్చి శ్రీరాంసాగర్ నింపే ప్రయత్నం చేయాల్సి రావడం దురదృష్టం. చేపలు పెంచుకునే మత్స్య కార్మికులను ఆదుకుంటున్నం. చేనేత కార్మికులను ఆదుకుంటున్నం. గౌడన్నలకు చెట్ల పన్ను రద్దు చేసింది ఎవరో మీ అందరికీ తెలుసు. రజక సోదరులకు ఏం లాభం జరిగిందో మీకు తెలుసు. సంచార పశువైద్య శాలలు మీకు తెలుసు. ఎంబిసి కార్పొరేషన్ పెట్టి వెయ్యి కోట్లు పెట్టిన విషయం కూడా మీకు తెలుసు. తెలంగాణలో ఉండే ప్రతి వ్యక్తి యెక్క హెల్త్ ప్రొఫైల్ తయారు చేసే ఆలోచన కూడా చేస్తున్నది.
కొందరు ఉద్యోగుల విషయంలో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చి 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చిన ప్రభుత్వం కేసిఆర్ ప్రభుత్వమే. ఉద్యోగులు దాని గురించి గాభరా కావాల్సిన అవసరం లేదు. ఉరికెటోడికి కాళ్లల్ల కట్టెబెట్టేటట్లు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు మొగ బిడ్డవే అయితే.. నువ్వు అయ్య అవ్వకే పుడితే అగ్రిమెంట్ తీసుకొచ్చి చూపిస్తే నేను బేగంపేట ఎయిర్ పోర్టు నుంచే నేను ఇంటికి కూడాపోను. ఇటునుంచి ఇటే రాజ్ భవన్ కు పోయి రాజీనామా ఇస్తా అన్నా. అయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిండా? పారిపోయిండు.
కంటి రెప్ప పాటు కూడా కరెంటు పోనీయను అని నేను అసెంబ్లీలో మాట్లాడిన. అప్పుడు జానారెడ్డి అది చేస్తే నేను టిఆర్ఎస్ కు ప్రచారం చేస్తా అన్నారు. కానీ ఇప్పుడు తప్పించుకు తిరుగుతున్నారు జానారెడ్డి. సిగ్గు లేకుండా మేము చంద్రబాబుతోటి పొ్త్తు కలుస్తాం అంటున్నారు. థూ.. మీ బుతుకులు చెడ. ఎవడైతే తెలంగాణను నాశనం చేసిండో, ఎవడైతే తెలంగాణలో ఎన్ కౌంటర్లు చేసిండో, తెలంగాణను దోచుకున్నడో తెలంగాణ ద్రోహితో పొత్తు పెట్టుకుంటున్నరు. థూ. మీ బతుకులు చెడ. అడుక్కుంటే మేమే ఇస్తాం కదా నాలుగు సీట్లు.
కాంగ్రెస్ పార్టీకి ఒక్క టికెట్ అన్నా ఇచ్చే మొఖం ఉన్నదా? తెలంగాణ ఏర్పాటులోనే టిఆర్ఎస్ పాత్ర లేదని గులాం నబీ ఆజాద్ మాట్లాడిండు. సిగ్గు ఉండాలె కొద్దిగా అయినా. జైపాల్ రెడ్డి ఉన్నడు. ఏనాడూ తెలంగాణ కోసం కొట్లాడలే. పదవులు వదులుకోలేదు. పసునూరి దయాకర్ సర్పంచ్ కూడా కాలేదు జీవితంలో కానీ వరంగల్ ప్రజలు గుద్దుడు గుద్దితే నాలుగు లక్షలతో గెలిచిండు. ఎటు పోయిండు జైపాల్ రెడ్డి.
దుర్మార్గుడైనటువంటి చంద్రబాబునాయుడుతో పొత్తా? మీ పొత్తు వల్ల బాధపడుతున్న నేను. పౌరుషం చూపిన ఈ గడ్డలో చంద్రబాబు కాళ్లు వత్తి దండం పెట్టి ఊరేగించి మల్లా తెస్తరట. ఇంత మంది చచ్చిపోయింది ఇందుకేనా? పోరాటం చేసింది ఇందుకేనా? 7 మండలాలు గుంజుకున్నది చంద్రబాబు. కరెంటు గోస పడ్డనాడు రాక్షస ఆనందం పొందిన రాక్షసి చంద్రబాబు. తెలంగాణ ప్రజెక్టులు ఆపాలని 36 లేఖలు రాసిండు చంద్రబాబునాయుడు. ఆ దుర్మార్గుడితోనా మీరు పొత్తు కలిసేది. ఎప్పుడో వచ్చిన వాళ్లను మేము ఆంధ్రావాళ్లుగా మేము చూస్తలేము. మీరూ తెలంగాణ బిడ్డలే. అక్కడ ఉన్నవారే ఆంధ్రావాళ్లు కానీ ఇక్కడ ఉన్నవారు ఆంద్రా వారు కాదు.
ఓటుకు నోటు కేసులో దొరికిన అడ్డమైన దొంగ కాదా? నిలువు దొంగ కాదా? దాచి దాచి తెచ్చిన తెలంగాణను చంద్రబాబుకు అప్పగించుదామా? గాడిది సంగీతం ఎత్తుకుంటే ఒంటె రాగం అందుకున్నది. ఒంటె అందం చూసి గాదిడ మూర్చ పడిపోయిందట. ఇందులో ఒంటె ఎవరో, గాడిద ఎవరో మీరే తెలుసుకోరి.
బిజెపోళ్లు ఇంటికో 15 లక్షలు బ్యాంకు ఖాతాలో వేస్తామన్నారు. స్నానం చేసేటప్పుడు ఈపు అందదు కాబట్టి ఈపు గోకుతాం. చమ్మట్క పోతే వాసన రాకుండా చేస్తాం అని హామీ ఇచ్చిర్రు బిజెపోళ్లు.
పిసిసి ప్రసిడెంట్ నన్ను పట్టుకుని అన్నడు. ముఖ్యమంత్రి బట్టెబాజ్ గాడు అన్నడు. నన్ను అనొచ్చునా పిసిసి ప్రసిడెంట్. ఎవడు బట్టెబాజ్ గాడో మీరు ఓటుతో చెప్పాలి.
నా నోరు కూడా చాలా చెడ్డ నోరే తెరిస్తెనాంటే తెల్లారినదాంకా తిడతా. కేసిఆర్ మెత్తబడ్డడా ఏందిరా అని అంటున్నారు. అది ఉద్యమం అప్పుడు అట్లా మాట్లాడిన. అది ఉద్యమం. ఇప్పుడు బాధ్యత. మల్లా ఒకసారి నిజామాబాద్ జిల్లాలో తొమ్మిదికి తొమ్మిది సీట్లు టిఆర్ఎస్ నే గెలిపించాలి.
