కాంగ్రెస్ రెడ్ల పార్టీ అయింది, జెయింట్ కిల్లర్ చిత్తరంజన్ కు కోపమొచ్చింది

కాంగ్రెస్ పార్టీలో ఎపుడు ఏంజరుగుతుందో ఎవరూచెప్పలేరు.  కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో రెడ్ల పార్టీ అని పేరుంది. ఈ పేరుతో కొంతమంది గర్వపడుతూ ఉంటే, మరి కొంతమంది భగ్గున మండుతున్నారు.    

 ఈ సారి పూర్తిగా అలా రెడ్ల పార్టీగా  బయటపడిపోదామని కాంగ్రెస్ పార్టీ ఒక  నిర్ణయానికి వచ్చినట్లుందని చాలా మంది పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అధికారంలో ఉన్న వెలమ పార్టీకి పోటీ ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ గా అవతరించాల్సిందే. ఇందులో కొత్త వాస్తవం లేెక పోలేదు. రెడ్లంతా కాంగ్రెస్ పార్టీని సొంత పార్టీ అనుకుంటే, క్యాస్ పోలరైజేషేన్ వల్ల కొంత ప్రయోజనం ఉంటుందని పార్టీ నాయకత్వం భావిస్తున్నదా?

అవునని చెబుతున్నారు కాంగ్రెస్ పార్టీ బిసి సెల్ ఛెయిర్మన్  జె చిత్తరంజన్.  ఎన్నికల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు.ఎందుకంటే, ఆయన 1989 ఎన్నికల్లో   నాటి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావును ఓడించారు. జె చిత్తరంజన్ , ఎన్టీరామారావు ల మధ్య పోటీ అంటే హస్తి మశకాంతరం అనిపిస్తుంది. అవును నిజంగా అలాంటిదే. డబ్బులేదు,  ఆగ్రకులం లేదు. కాకలుతీరిని  రాజకీయ నాయకుడు కూడా కాదు. కాకపోతే, సిటింగ్ ఎమ్మెల్యే. అయినా చిత్త రంజన్ అనే దోమ చేతిలో ఏనుగు లాంటి ఎన్టీరామారావు ఓడిపోయారు.ఎన్టీరామారావు రెండో నియోజకవర్గం హిందూపురం నుంచి పోటీ చేసి గెలుపొందారు. కాబట్టి ప్రతిపక్ష నాయకుడయ్యారు.

1989లో తెలుగుదేశం  పార్టీ ఘోరంగా పరాభవం పాలయింది. ఒక ఉప్పెనలా 1983లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశంపార్టీ 74 సీట్లకే పరిమితమయింది.  2914లో 287 సీట్లకు పోటీ చేసిన కాంగ్రస్ పార్టీ 181 సీట్లు గెల్చుకుంది. కల్వకుర్తి నియోజకవర్గంలో  చిత్తరంజన్ దాస్‌కు 54,354 ఓట్లు పోలయితే, ముఖ్యమంత్రి  ఎన్టీరామారావుకు 50,786 ఓట్లు వచ్చాయి. ఎన్టీఆర్‌పై 3,568 ఓట్ల మెజార్టీ సాధించి  చిత్తరంజన్ జెయింట్ కిల్లర్‌గా పేరు పడ్డారు. మంత్రి అయ్యారు.

చిత్తరంజన్ ముదిరాజ్ బిసి కులానికి చెందిన నాయకుడు.

అయితే, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ చిత్తరంజన్ వదిలేసింది. అప్పటినుంచి ఆయన పార్టీలో ఉన్నాడు, ఏవో బిసి సెల్ ఛెయిర్మన్ వంటి పార్టీ పదవులు నిర్వహిస్తున్నాడు. ఎన్నికలపుడు మాత్రం ఆయన మొండిచేయే. ఈ సారి ఆయన తనకు టికెట్ వస్తుందనుకున్నారు. రాలేదు. ఇది బిసిలకు జరుగుతున్న అన్యాయమని ఆయన గాంధీ భవన్ దగ్గిర ఈ రోజు ధర్నా చేశారు.

ధర్నాను ఎవ్వరూ పట్టించుకోవడం లేదని నిరాశతో ‘తెలుగురాజ్యం’కు చెప్పారు.

కాంగ్రెస్ ను రెడ్ల పార్టీగా మారుస్తున్నారని ఆయన ఆవేదన చెందారు. పార్టీ వెనకబడిన వర్గాల సెల్ కు చెయిర్మన్ అయినా నాకు టికెట్ రాలేదు. పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు టికెట్ ఇవ్వలేదు. అదేవిధంగా మరొక సీనియర్ బిసి నేత వి హనుమంతరావుకు కూడా టికెట్ రాలేదు. ఇది బిసిలను కాావాలనే పక్కన పెడుతున్న కుట్ర అని ఆయన ఆరోపిస్తున్నారు.

రాహుల్ గాాంధీ ఒక వైపు కొత్తగా పార్టీ లో చేరిన వాళ్లకి టికెట్ ఇచ్చేది లేదని చెబుతున్నారు, తీరాచూస్తే  కాంగ్రెస్ పార్టీవాళ్లకే రెడ్ కార్పెట్ పరుస్తూ ఉందని ఆయన విమర్శించారు.