ప్లాష్ న్యూస్ : తెలంగాణ బిజెపి తొలి జాబితా రెడీ

BJP

తెలంగాణలో తమ సత్తా ఏంటో చాటేందుకు బిజెపి రెడీ అయింది. తెలంగాణ ముందస్తు ఎన్నికలకు ఎవరినీ ఇన్ఛార్జిగా ప్రకటించలేదు పార్టీ అధినేత అమిత్ షా. ఆయనే తెలంగాణ వ్యవహారాలు చూసుకుంటానని ప్రకటించారు. ఒంటరిపోరు చేయడానికి సిద్ధమైంది కమలం పార్టీ. ఈ నేపథ్యంలో తెలంగాణ అంతటా అభ్యర్థులను బరిలోకి దింపేందుకు ప్లాన్ చేస్తోంది. 

కేంద్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో తెలంగాణలో బలపడేందుకు చాన్స్ ఉందని బిజెపి భావిస్తోంది. దీంతో ఇక్కడ ఎలాగైనా సత్తా చాటాలని గౌరవప్రదమైన స్థానాలు చేజిక్కించుకోవాలన్న కసితో బిజెపి ఉంది. అందుకే అధికార, ఇతర పక్షాల తో ధీటుగా ముందస్తు ఏర్పాట్లలో దూసుకుపోతున్నది భారతీయ జనతా పార్టీ. 

 తెలంగాణలో అమిత్ షా ఇట్ల పర్యటన జరిపిండో లేదో అట్ల ముందస్తు అసెంబ్లీ ఎన్నికల తొలి జాబితా రెడీ అయినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అమిత్ షా పర్యటన విజయవంతమైందని బిజెపి నేతలు ప్రకటించారు. ఈ సమయంలో అమిత్ షా తెలంగాణ నుంచి వెళ్లగానే తొలి జాబితా రెడీ చేశారని వార్తలొస్తున్నాయి.

బిజెపి వర్గాలు చెబుతున్న సమాచారం, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బిజెపి తొలి జాబితా ఇదే (విశ్వసనీయ సమాచారం ఆధారంగా)

హైదరాబాద్ సిట్టింగ్ స్థానాలు ఎవరివి వారికే ఖరారు. అందులో అంబర్ పేట్ కిషన్ రెడ్డి, ముషీరాబాద్ డాక్టర్ లక్ష్మణ్, గోషా మహల్ రాజాసింగ్, ఉప్పల్ ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్, ఖైరతాబాద్ చింతల రామచంద్రారెడ్డి లకు ఖరారైనట్లు చెబుతున్నారు.

ఇక మిగిలిన వాటిలో…

పెద్దపల్లి -గుజ్జుల రామకృష్ణ రెడ్డి
సికింద్రాబాద్-సతీష్ గౌడ్
మునుగోడు-జీ. మనోహర్ రెడ్డి
మహేశ్వరం-సుధాకర్ శర్మ
కరీంనగర్-బండి సంజయ్
హుస్నాబాద్-కొత్త శ్రీనివాస్ రెడ్డి
మల్కాజిగిరి-ఎన్. రామచందర్ రావు
మనకొండూర్- గడ్డం నాగరాజు
కల్వకుర్తి-ఆచారి
కూకట్పల్లి-కాంతరావు
భూపాలపల్లి-కీర్తిరెడ్డి
వరంగల్ వెస్ట్-రావు పద్మ
సూర్యాపేట-వెంకటేశ్వర్ రావు
భువనగిరి-జి శ్యామసుందర్ రావు
సత్తుపల్లి -నగమల్లీశ్వర్ రావు
చెన్నూర్-రాం వేణు
దుబ్బాక-రఘునందన్ రావు
నిజామాబాద్ అర్బన్-యెండల లక్ష్మినారాయణ
బాన్సువాడ-డి.అరవింద్
సిరిసిల్ల-ఆకుల విజయ
వేములవాడ-ప్రతాప రామకృష్ణ
కోరుట్ల-బాజోజి భాస్కర్ లేదా
తాడూరి నరసింహ చలం
సిద్దిపేట-నరోత్తం రెడ్డి
ముథోల్-పి.రమాదేవి
ఆదిలాబాద్-పాయల శంకర్
నిర్మల్ -స్వర్ణ రెడ్డి
రామగుండం-బలమురి వనిత రావు.
మిగతా అభ్యర్థులను కూడా వారం పది రోజులలో ఫైనల్ చేసే అవకాశం ఉంది.