వికారాబాద్‌ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఏడుమంది మృతి !

వికారాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మోమిన్ పేట్ మండలం ఇజ్రా చిట్టెంపల్లి తండాకు సమీపంలో లారీ, ఆర్టీసీ బస్సు, ఆటో మూడు ఒకదానికొకటి ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

Vikarabad Road Accident: వికారాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

పొగ మంచు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అక్కడున్న వారు చెబుతున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. మృతులంతా కూలీలుగా తెలుస్తోంది. వారిలో మహిళలు కూడా ఉన్నారు.

మరోవైపు ప్రమాదం జరిగిన సమాచారం తెలుసుకున్న స్థానికులు కూడా సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు ఆర్టీసీ బస్సు.. లారీని తప్పించబోతుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. ఇక, ప్రమాదానికి గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. స్థానికులతో పాటు, ఆర్టీసీ, లారీ డ్రైవర్లను, ప్రమాదంలో గాయపడిన వారి నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు.అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.