ఈ పోస్టాఫీసు స్కీమ్ ద్వారా భార్యాభర్తలు రూ. 59,400 పొందవచ్చు .. ఎలాగో తెలుసా..?

పోస్టాఫీసు తన కస్టమర్లకు ఎన్నో సేవలు అందిస్తోంది. ఈ క్రమంలో కొన్ని కొత్త కొత్త స్కీమ్స్ ద్వారా కూడా ప్రజలు సేవలు అందిస్తోంది. ఇలాంటి స్కీమ్స్ లో డబ్బులు పెట్టి అధిక ఆదాయం పొందవచ్చు. ఇలా ఆర్డి, సుకన్య యోజన వంటి ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. అయితే పోస్టాఫీసు లో ఉండే మంత్లీ ఇన్ కమ్ అనే ప్రత్యేకమైన స్కీమ్ ద్వారా భార్యా భర్తలు కొంత మొత్తం డబ్బు ఇన్వెష్ట్ చేసి రూ. 59400 పొందవచ్చు. ఈ స్కీమ్ పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.

పోస్టాఫీసు లో ఉండే మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ వలన నెలకు రూ.4950 వచ్చే అవకాశం వుంది. ఈ స్కీమ్‌ లో మొదట కనీసం రూ.1000ను పెట్టుబడిగా పెట్టవచ్చు. ఈ స్కీం లో సింగిల్ గా అకౌంట్ ఓపెన్ చేయవచ్చు… లేదా భార్యా భర్తలు కలిసి జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేయవచ్చు. ఈ స్కీమ్ కింద ఇద్దరు లేదా ముగ్గురు కలిసి ఓపెన్ చేసుకోవచ్చు. కావాలంటే మీకు నచ్చినప్పుడు అకౌంట్ ని జాయింట్ లేదా సింగల్ కింద మార్చుకోవచ్చు.

ఇలా ఒక్కరే అకౌంట్ ఓపెన్ చేస్తే చేస్తే గరిష్టంగా నాలుగున్నర లక్షలు వస్తాయి. అల కాకుండా జాయింట్ గా అకౌంట్ ఓపెన్ చేస్తే గరిష్టంగా రూ.9 లక్షలు డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ లో కనుక డబ్బులు పెట్టటం వల్ల ఉద్యోగులకు, సీనియర్ సిటిజన్లకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెష్ట్ చేయటం వల్ల 6.6 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. డిపాజిట్ల పై పొందిన వార్షిక వడ్డీరేటును ఆధారంగా వడ్డీని లెక్క పెడతారు. భార్యాభర్తలిద్దరూ కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తే రూ.9 లక్షలను పెడితే రూ.9 లక్షలకి, 6.6 శాతం వడ్డీ రేటుని కలిపి సంవత్సరానికి రూ.59,400 వస్తాయి. దీన్ని పన్నెండు కింద డివైడ్ చేస్తే ప్రతినెలా రూ.4950 చేతికి వస్తాయి. ఈ అకౌంట్ ఓపెన్ చేసిన ఐదేళ్లకి ఈ స్కీమ్ మెచ్యూర్ అవుతుంది.