ఎస్బిఐ కస్టమర్స్ కి గుడ్ న్యూస్… మినీ స్టేట్మెంట్ కోసం ఇకపై ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే చాలు..!

దేశవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఒకటి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ సంస్థ దేశవ్యాప్తంగా ప్రజలకు అనేక సేవలు అందిస్తోంది. కస్టమర్స్ అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త విధానాలను అమలులోకి తీసుకువచ్చి ఎస్బిఐ తన కస్టమర్లకు అనేక సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే ఆన్లైన్ బ్యాంకింగ్, యూపీఐ, టోల్ ఫ్రీ నంబర్, ఎస్ఎంఎస్ ద్వారా కూడా కస్టమర్లకు సేవలు అందిస్తోంది. తాజాగా తన కస్టమర్స్ కోసం మరొక విధానాన్ని అమలులోకి తీసుకురానుంది.

అయితే మినీ స్టేట్‌మెంట్‌ కోసం ఏటీఎం, బ్యాంక్ కి వెళ్లాల్సిన అవసరం లేకుండా మిస్డ్ కాల్ ద్వారా మినీ స్టేట్మెంట్ అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఎస్బీఐ క్విక్ బ్యాంకింగ్, మిస్డ్ కాల్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ వంటి విధానాల ద్వార మినీ-స్టేట్‌మెంట్‌ను పొందవచ్చు. ఈ సేవల కోసం
కస్టమర్స్ వారి ఫోన్ నెంబర్ ని అకౌంట్ కి లింక్ చేయించుకోవలసి ఉంటుంది. అప్పుడే ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. NEFT, RTGS, IMPS, UPI వంటి వివిధ మోడ్‌ల ద్వారా నిర్వహించబడే అన్ని ట్రాన్సక్షన్స్ డీటెయిల్స్ ఉంటాయి.

ఎస్బిఐ కస్టమర్ వారి అకౌంట్ బ్యాలెన్స్ వివరాల గురించి తెలుసుకోవటానికి ఎస్బీఐ టోల్-ఫ్రీ నంబర్ 9223766666 కాల్ చేసి . అకౌంట్ బ్యాలెన్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ ఎస్బిఐ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయడం ద్వారా బ్యాలెన్స్ వివరాల గురించి పూర్తి సమాచారం పొందవచ్చు. అంతేకాకుండా
09223866666 ఎస్బిఐ నంబర్ కి మిస్డ్ కాల్ ఇచ్చి మీరు జరిపిన గత 5 లావాదేవీలకు సంబంధించిన మినీ స్టేట్ మెంట్ వివరాల గురించి పూర్తి సమాచారం పొందవచ్చు. ఈ మిస్డ్ కాల్ స్కీం ద్వారా ఎస్బిఐ కస్టమర్లు ఇకపై ఇంట్లో కూర్చొని మినీ స్టేట్మెంట్ వివరాల గురించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.