ఆ టీవీ ఛానెల్స్‌తో సానియాకు తలనొప్పి వచ్చిందట..ఎందుకంటే??

ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ కోపానికి కారణమయ్యాయి కొన్ని టీవీ ఛానెళ్లు. కొన్ని నెలల తర్వాత న్యూస్ చూడటానికి కూర్చున్న సానియాను డిసప్పాయింట్ చేశాయట ఆ ఛానెళ్లు. ఈ విషయాన్ని ట్విట్టర్లో పేర్కొంది సానియా మీర్జా.

త్వరలో తల్లి కాబోతున్న సానియా మీర్జా ప్రస్తతం టెన్నిస్ క్రీడకు దూరంగా ఉంది. ఇప్పుడు తన శ్రద్ధ అంత తనకు పుట్టబోయే బిడ్డపైనే పెట్టేసింది. తరచూ ట్విట్టర్ ద్వారా తనకు సంబంధించిన విషయాలను, సామజిక పరమైన అంశాలను అభిమానులతో పంచుకుంటుంది సానియా.

కొన్ని నెలల తర్వాత కొన్ని న్యూస్ ఛానెల్స్ చూశాను. ఎందుకు చూశానో మాత్రం అడగకండి. అది చూస్తుంటే ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదు. 12 మంది ఒకే స్క్రీన్ పైన కనిపిస్తున్నారు కానీ మాట్లాడట్లేదు న్యూస్ రిపోర్టింగ్ లేదు. ఒకటే అరుచుకుంటున్నారు. అది చూసి నాకు తల నొప్పి వచ్చేసింది. మల్లి కొన్ని నెలల తర్వాత చూడటానికి ట్రై చేస్తాను అంటూ ట్వీట్ చేసింది సానియా.

https://platform.twitter.com/widgets.js