న‌టిగా మార‌బోతున్న టెన్నిస్ క్రీడాకారిణి.. ఇక రికార్డుల మోత మోగాల్సిందే అంటున్న ఫ్యాన్స్

త‌న ఆట‌తో పాటు అందంతో ఎంద‌రో మ‌న‌సుల‌ని దోచుకున్న ప్ర‌ముఖ టెన్నిస్ క్రీడీకారిణి సానియా మీర్జా. హైద‌రాబాద్‌కు చెందిన సానియా మహిళల డబుల్స్ లో నెం.1 ర్యాంకు పొందిన క్రీడాకారిణి. కెరీర్ మొదట్నుంచే అత్యంత విజయవంతమైన భారతీయ టెన్నిస్ క్రీడాకారిణిగా నిలిచిన సానియా ఎక్కువ పారితోషికం అందుకునే అథ్లెటిక్ క్రీడాకారిణిగా కూడా మారింది.
రీసెంట్‌గా 34వ బ‌ర్త్‌డే జరుకున్న సానియాకు సినీ, క్రీడా తారలు శుభాకాంక్షలు చెప్పారు. యువ‌రాజ్ మిర్చీ మ‌మ్మీ అంటూ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ సంవ‌త్స‌రం మీకు అంతా మంచి జ‌ర‌గాల‌ని విషెస్ చెప్పారు.

సానియా గ్రౌండ్‌లో దిగిందంటే అవ‌తలి వ్య‌క్తికి చెమ‌టలు ప‌ట్టిస్తుంది. పాకిస్తాన్ క్రికెట‌ర్ షోయబ్ మాలిక్‌ను పెళ్ళాడాక సానియా ఆట‌కు కాస్త దూర‌మైంది. ప్ర‌స్తుతం త‌న పిల్ల‌ల‌తో ఆనంద క్ష‌ణాలు గడుపుతుంది. అయితే ఓ మంచి ప‌ని కోసం సానియా మీర్జా న‌టిగా మారేందుకు సిద్ధ‌మైంది. భార‌త్‌లో ట్యుబ‌ర్ కోలోసిస్ (టీబీ) నిత్యం ఎంతో మందికి ప్ర‌శాంత‌త లేకుండా చేస్తుంది. క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తున్న స‌మ‌యంలో ఇది చాలా ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంటుంది. ఇందుకోసం త‌ను చేప‌ట్టే షోతో దేశంలో సానుకూల‌ మార్పు తీసుకురావాల‌ని సానియామీర్జా ఆకాంక్షించింది.

ఎంటీవీ స‌మ‌ర్పిస్తున్న నిషేద్ ఎలోన్ టుగెద‌ర్ వెబ్ సిరీస్ షోలో న‌టించేందుకు సానియా గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌గా, ఇది 5 ఎపిసోడ్స్ గా ప్ర‌సారం కానుంది. న‌వంబ‌ర్ చివ‌రి వారం నుండి ఎంటీవీ లో ప్ర‌సారం కానున్న ఈ షో ప్ర‌తి ఒక్క‌రికి అవ‌గాహ‌న క‌ల్పిస్తుంద‌ని త‌ను విశ్వ‌సిస్తుంది. అయితే ఇన్నాళ్ళు గ్రౌండ్‌లో చిచ్చ‌ర‌పిడుగులా రెచ్చిపోయిన సానియా మీర్జా ఇప్పుడు న‌టిగా రికార్డులు క్రియేట్ చేయ‌డం ఖాయ‌మ‌ని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. త్వ‌ర‌లో వెండితెర‌పై కూడా మెర‌వాల‌ని కోరుకుంటున్నారు