లంక‌ క్రికెట‌ర్లు ప్ర‌యాణించిన‌ బ‌స్సులో బుల్లెట్!

శ్రీలంక ఆట‌గాళ్లు ప్రయాణించిన‌ వాహ‌నంలో రెండు బుల్లెట్ షెల్స్ బ‌య‌ట‌ప‌డ్డాయి. దీంత లంక శిబిరంలో ఒక్కసారిగా క‌ల‌క‌లం రేగింది. వారు బ‌స చేస్తున్న లలిత్ హోటల్ నుంచి లంక క్రికెట‌ర్లు ఓ ప్రైవేట్ బ‌స్సులో పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) స్టేడియానికి వెళుతున్న సమయంలో.. పోలీసు ఆ బస్సును త‌నిఖీ చేయగా అందులో రెండు ఖాళీ బుల్లెట్ షెల్స్ కనిపించాయి. ఈ బస్సును లంక ప్లేయర్ల కోసం అద్దెకి తీసుకోవడానికి కంటే ముందు ఓ మ్యారేజ్ ఫంక్షన్ కోసం వాడినట్టు పోలీసుల విచార‌ణ‌లో వెల్లడైంది. తదుపరి విచారణ కోసం మరికొందర్ని పోలీసులు విచారిస్తున్నారు