IND vs SL | 109 పరుగులకే లంక ఆలౌట్..చెలరెగిన బుమ్రా

బెంగళూరు టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక జట్టు 109 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా స్టార్ పేసర్, వైస్ కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని తక్కువ పరుగులకే కట్టడి చేశాడు. మిగితా బౌలర్లలో షమీ, అశ్విన్ చెరో రెండు వికెట్లు తియగా.. అక్షర్ ఒక వికెట్ పడగొట్టాడు. తొలి రోజు ఆట నుండే శ్రీలంక బ్యాటర్లు.. భారత బౌలర్ల దాటికి ఏమాత్రం నిలవలేకపోయారు. కుశాల్ మెండిస్ (2), దిముత్ కరుణరత్నే (4), లాహిరు తిరిమానే (8), ధనంజయ డిసిల్వా (10), చరిత్ ఆసలంక (5) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. ఏంజెలో మాథ్యూస్ (43) ఒక్కడే కొంత పోరాట పటిమ చూపాడు. రెండో రోజు ఆట మొదలైన కాసేపటికే డిక్కవెల్ల (21), ఎంబుల్డెనియా (1)ల వికెట్లు కొల్పోయింది శ్రీలంక. ఆ తర్వాత అశ్విన్.. సురంగ లక్మల్ (5), విశ్వ ఫెర్నాండో (8)ను పెవిలియన్ చేర్చాడు.