PKL 2022: ప్రొ కబడ్డీ చాంపియన్స్‌గా దబంగ్‌ ఢిల్లీ

Dabang Delhi

ప్రొ కబడ్డీ లీగ్‌ ఫైనల్‌లో దబంగ్‌ ఢిల్లీ జట్టు తొలిసారి విజేతగా నిలిచింది. దబంగ్‌ ఢిల్లీ, పట్నా పైరేట్స్‌ మధ్య  హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 37–36తో విజయం సాధించింది. ఢిల్లీ గెలుపులో రెయిడర్లు నవీన్‌ కుమార్, విజయ్‌ మలిక్‌ అద్భుతంగా రాణించారు. విజయ్‌ 14 పాయింట్ల, నవీన్‌ 13 పాయింట్లతో దబంగ్‌ ఢిల్లీ ట్రోఫి సాధించడంలో కీలక పాత్ర పోషించారు. పట్నా టీంలో సచిన్‌ 10 పాయింట్లతో రాణించాడు. విన్నర్‌గా నిలిచిన ఢిల్లీకి రూ. 3 కోట్లు… రన్నరప్‌ పట్నాకు రూ. కోటీ 80 లక్షల ప్రైజ్‌మనీగా లభించింది.