థాయిలాండ్ ఓపెన్ ఫైనల్లో పీవీ సింధు ఓటమి

థాయ్ లాండ్ ఓపెన్ ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి ఒకుహర చేతిలో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఓడిపోయారు. 21-15,21-18 తేడాతో పీవీ  సింధు ఓటమి చవిచూసింది. తొలి రౌండ్ లో మొదటి నుంచి వెనుకబడిపోయినా రెండో రౌండ్ లో  సింధు పుంజుకోగలిగింది. ఒకుహరా కూడా అంతే స్థాయిలో పోటి ఇవ్వటంతో హోరాహోరీగా పోటీ  సాగింది. అయినా సింధు ఒకుహరా అటాకింగ్ ప్లే ముందు నిలవలేక ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో గెలిచి ఈ ఏడాది తొలి టైటిల్ గెలవాలనుకున్న సింధు కల కలగానే మిగిలిపోయింది.