సినిమా ఫంక్షన్ లో సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్.. గతాన్ని తల్చుకొని మరి!

సాయి ధరమ్ తేజ్ తెలుగు సినీ నటుడు. చిరంజీవి మేనల్లుడు గా అందరికీ సుపరిచితమే. ఇతను వై. వి. ఎస్. చౌదరి దర్శకత్వం వహించిన రేయ్ సినిమాలో మొదట నటించినప్పటికీ.. పిల్లా నువ్వు లేని జీవితం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు.

ఆ తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, తిక్క, విన్నర్ వంటి వరుస సినిమాలతో ముందుకు దూసుకుపోతూ తనకంటూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే తన తమ్ముడు వైష్ణవ్ తేజ్ సినిమా ట్రైలర్ ఫంక్షన్ లో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్ కాస్త ఎమోషనల్ అయి తాను 90 వేసి రాలేదని, గతంలో బైక్ స్కిడ్ అయ్యి కిందపడ్డ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు.

ఆ సమయంలో తన తమ్ముడు తనతో మాట్లాడినప్పుడు చాలా బాధగా అనిపించింది అని పేర్కొనడం జరిగింది. తను ఇసుక ఉందని చూసుకోకుండా బ్రేక్ వేసినందుకే బైక్ స్కిడ్ అయ్యి కింద పడ్డానని హెల్మెట్ ఉండడం ద్వారా ప్రమాదం తప్పిందని తెలిపాడు. ఫంక్షన్ లో పాల్గొన్న అందరిని బైక్ పై వెళ్లేటప్పుడు కచ్చితంగా హెల్మెట్ ధరించండి అంటూ కాస్త ఎమోషనల్ గా మాట్లాడడం జరిగింది.

తరువాత సినిమా గురించి చెబుతూ తన తమ్ముణ్ణి ప్రేక్షకులు ఆదరించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొనడం జరిగింది. తను 90 వేసి ఈ ఫంక్షన్ కు రాలేదని, తను లో ఉన్న బాధను పంచుకుంటున్నాడని పేర్కొనడం జరిగింది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో చేరి వైరల్ గా మారింది.

ఈ వార్త తెలిసిన వారందరూ సాయి ధరమ్ తేజ్ గ్రేట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సాయి ధరమ్ తేజ్ కుటుంబం గురించి చాలా చక్కగా చెప్పారని, నేటిజన్స్ పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.