Y.S Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల పోలవరం నిర్వాసితులను కలిశారు. ఈ సందర్భంగా షర్మిల వారితో మాట్లాడుతూ తన అన్నయ్య మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి కల పోలవరం ప్రాజెక్టు అని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత ఆయన కుమారుడనీ చెప్పుకుంటూ ఒక్క అవకాశం ఇవ్వాలన్న జగనన్నకు ప్రజలు పట్టం కట్టారు. నవరత్నాల పేరిట ఈయన పోలవరం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే పూర్తి చేస్తామని తెలిపారు.
ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టేసారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా రాజీ పడ్డారని ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు.41 మీటర్లకే పోలవరం ప్రాజెక్టు ఎత్తులో కడతామని జగన్, చంద్రబాబు ఒప్పుకున్నారని విమర్శించారు.
జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పదవీ కాలంలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకపోగా.. ఎత్తు విషయంలో సరెండర్ అయ్యారని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు కూడా తామేమీ తక్కువ తినలేదనే విధానంలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ఎత్తు తగ్గిస్తుంటే వైసీపీ, టీడీపీ నాయకుల్లో ఒక్కరూ కూడా నోరు విప్పలేదని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసారు.ఇలా పోలవరం ప్రాజెక్టు విషయంలో ఈమె అక్కడ వారితో మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనగా మారాయి.