బాబును ఇరకాటంలో పెట్టడానికి జగన్ సాలిడ్ ప్లాన్

jagan cbn telugu rajyam

అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు వల్ల ఎదుర్కొన్న సమస్యలు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి టీడీపీ అధినేత, తనను ఇబ్బందులకు గురి చేసిన చంద్రబాబు నాయుడును, టీడీపీ నాయకులను టార్గెట్ చేశారని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసిన ఎవరికైనా అర్ధమవుతుంది. ఇలా చంద్రబాబు నాయుడుపై తనకున్న కోపాన్ని తీర్చుకోవడానికి జగన్ కొత్త పతకం ఒకటి రచించారని తెలుస్తుంది. ఈ పతాకాన్ని ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దల సహాయంతో రూపొందుతుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

YS Jagan should repair CBN's damages to education system 
YS Jagan should repair CBN’s damages to education system

జగన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్

జగన్ తన రాజకీయ ప్రస్థానం మొదలైన రోజుల్లోనే జైల్లో గడపడానికి చంద్రబాబు నాయుడు కూడా ఒక కారణం. ఇలా కారణమైన చంద్రబాబు నాయుడుపై జగన్ కూడా బీజేపీ ససహాయంతోసరికొత్త పతాకాన్ని శ్రీకారం చుట్టనున్నారని సమాచారం. అదేంటంటే బీజేపీ ఇప్పుడు ఉత్తర ఉన్న కొన్ని రాష్ట్రాల్లో పూర్తిగా పట్టుకోల్పోయింది. రానున్న ఎన్నికల్లో అక్కడ ఓటమి తప్పదని బీజేపీ నాయకులు కూడా భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు బీజేపీ పెద్దలు జగన్ ను మచ్చిక చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ప్రతిఫలంగా తనను కేసుల్లో ఇరికించి చంద్రబాబు నాయుడుపై సీబీఐ విచారణలు జరిపించాలని జగన్ ఒక కండిషన్ పెట్టారని తెలుస్తుంది. ఒకవేళ బీజేపీ నేతలు కూడా ఈ కండిషన్ కు ఒప్పుకుంటే చంద్రబాబు నాయుడు కూడా రానున్న రోజుల్లో జైల్ కష్టాలు పడాల్సిందే.

బీజేపీని పట్టుకున్న టీడీపీ

జగన్ మద్దతు కోసం బీజేపీ నాయకులు ఆరాటపడుతుంటే, బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు నాయుడు ఆరాటపడుతున్నారు. ఎన్నికలు వచ్చే సమయానికి బీజేపీ కలిసి నడవడానికి చంద్రబాబు సిద్ధపడుతున్నారు. జగన్ పై మొగ్గు చూపుతున్న బీజేపీ పెద్దలు మాత్రం చంద్రబాబు నాయుడును పట్టుంచుకోవడం లేదు. చంద్రబాబు నాయుడుకు జగన్ బీజేపీతో కలిసి తనకు ఇబ్బందులు తెస్తారనే ఉద్దేశంతోనే బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి రానున్న రోజుల్లో బీజేపీ టీడీపీతో కలిసి నడుస్తుందో లేక వైసీపీ వెంట వెళ్తుందో వేచి చూడాలి.