టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లతో బిజీగా ఉన్న హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఎన్టీఆర్ ఓకే చెబితే 200 కోట్ల రూపాయల నుంచి 300 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసి సినిమాలను నిర్మించడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. తెలుగులో చాలామంది స్టార్ హీరోలకు సొంత బ్యానర్లు ఉన్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సొంత బ్యానర్ లేకపోయినా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తారక్ ఆసక్తి చూపుతున్నారు.
ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీ యువసుధ ఆర్ట్స్ తో ఎన్టీఆర్ ఆర్ట్స్ భాగస్వామ్యంతో తెరకెక్కనుంది. మహేష్, చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్ లకు సొంతంగా బ్యానర్లు ఉండగా ఎన్టీఆర్ తర్వాత సినిమాలన్నీ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మరో బ్యానర్ తో భాగస్వామ్యమై తెరకెక్కించేలా మేకర్స్ జాగ్రత్త పడుతున్నారని సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ ప్రశాంత్ కాంబో మూవీ కూడా మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కనుంది.
వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్న తారక్ భవిష్యత్తు సినిమాలు సైతం ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లోనే తెరకెక్కనుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ కు కళ్యాణ్ రామ్ అధినేత కాగా తన అన్న బ్యానర్ ను చేర్చడం వల్ల అన్నయ్యను కూడా సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా చేయవచ్చని తారక్ భావిస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఇప్పటికే జై లవకుశ సినిమా తెరకెక్కిందనే సంగతి తెలిసిందే.
జై లవకుశ ఎన్టీఆర్ ఆర్ట్స్ సోలో మూవీ కాగా కళ్యాణ్ రామ్ బ్యానర్ ను తన తర్వాత సినిమాలకు తారక్ యాడ్ చేశారు. స్క్రిప్ట్ విషయంలో పక్కాగా ఉండే తారక్ తర్వాత సినిమాలతో కూడా సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా హీరోగా ఎదిగిన తారక్ పాన్ వరల్డ్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో సమయం పట్టదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
