షాకింగ్: 15 ఏళ్ల బాలుడితో.. ముగ్గురు పిల్లల తల్లి ఏం చేసిందంటే..!?

పెళ్లైన వ్యక్తికి వివాహేతర సంబంధం, వివాహితకు పెళ్లైన వ్యక్తితో సంబంధం, వివాహితుడు వేరొక స్త్రీతో రహస్య కాపురం పెట్టడం, అవివాహిత పెళ్లైన వ్యక్తిని ప్రేమించడం, పెళ్లికాని వ్యక్తి పెళ్లైన మహిళతో సంబంధం, వివాహిత పెళ్లికాని యువకుడితో అక్రమ సంబంధం, ఇద్దరు యువతీ యువకులు ఇంట్లో నుంచి వెళ్లిపోవడం, యువతీ యువకులు ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకోవడం.. ఇటువంటి ఘటనలు ఎన్నో గతంలో జరిగాయి.. జరుగుతూనే ఉన్నాయి. అయితే.. ఇందుకు విరుద్ధంగా ఎవరూ ఊహించని వివాహేతర ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ లో జరిగింది. పెళ్లై ముగ్గరు పిల్లలున్న ఓ మహిళ.. 15 ఏళ్ల బాలుడితో వెళ్లిపోయింది. ఆశ్చర్యం అనిపించే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు..

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ సమీపంలోని కంపియాగంజ్‌ ప్రాంతంలో ఓ వివాహిత తన ముగ్గురు పిల్లలతో కలిసి నివసిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల ఓ కుర్రాడు ఏడో తరగతి చదువుతున్నాడు. ఒకే ప్రాంతం కావడంతో ఆమె ఇంటికి తరచూ వస్తుండేవాడు.. ఆ బాలుడు. ఈక్రమంలో బాలుడితో వివాహిత పరిచయం పెంచుకుంది. ఆ పరిచయంతో ఆ కుర్రాడిని మభ్యపెట్టి తన శారీరక కోరికలు తీర్చుకునేది. దీంతో వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అక్కడితో ఆగకుండా ఆమె బాలుడితో కలిసి వెళ్లిపోవడానికి నిశ్చయించుకుంది. బాలుడికి మాయమాటలు చెప్పి ఇంట్లో ఎవరూ లేని సమయంలో మార్చి 10న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.

మొత్తంగా ఆ విషయం మహిళ ఇంటితోపాటు బాలుడి ఇంట్లో కూడా తెలిసింది. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. జరగిన విషయం బయటకు వస్తే పరువు పోతుందని భావించి రహస్యంగా వారిద్దరి కోసం గాలించారు. కానీ, ఎంతకీ వారి ఆచూకీ తెలీలేదు. దీంతో చేసేదిలేక పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పుకొచ్చారు. వివరాలు సేకరించిన పోలీసులే విస్తుపోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ మహిళ తమ కుమారుడిని ప్రలోభానికి గురి చేసి తనతో తీసుకెళ్లిందని బాలుడి కుటుంబసభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది.