Suicide: బట్టలు సరిగా ఉతకలేదన్న భర్త.. మనస్తాపం చెందిన భార్య చివరికి అలా..?

Suicide: భార్యాభర్తల మధ్య గొడవలు అన్నవి సహజంగా వస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు గొడవలు పెద్దవి కూడా కావచ్చు. ఇలా గొడవలు వచ్చిన సందర్భాలలో దంపతులు ఇద్దరిలో ఎవరో ఒకరు మౌనంగా ఉండటం వల్ల ఆ గొడవ పెద్దది కాకుండా అలాగే వారి సంసార జీవితం కూడా బాగుంటుంది. అలా కాకుండా భార్య భర్తల మధ్య గొడవలు జరిగినప్పుడు నువ్వా నేనా అన్నట్టు ఉంటే, ఇక వారి జీవితంలో ఎప్పుడు కూడా పోట్లాటలు వస్తూనే ఉంటాయి. కొన్ని సందర్భాలలో అది పెద్దవిఅయ్యి ప్రాణాలు తీసే వరకు కూడా వెళ్ళవచ్చు.

కానీ తాజాగా జరిగిన ఒక సంఘటన అందుకు పూర్తి భిన్నంగా ఉంది. బట్టలు సరిగా ఉతకలేదు అని అనడంతో భార్య ఏకంగా ఆత్మ హత్య చేసుకుని చనిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే… మెట్ పల్లి గాజుల పేట కాలనీకి చెందిన పర్హానాబేగం కు నిజామాబాద్ కు చెందిన వాజిద్ ఖాన్ అనే వ్యక్తి తో 2016 లో వివాహం జరిగింది. ఈ దంపతులకు 17 నెలల ఒక పాప కూడా ఉంది. అయితే పెళ్లయిన కొత్తలో బాగానే ఉన్న ఈ జంట కొద్ది రోజులు గడిచిన తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. చిన్న చిన్న వాటికి ఇద్దరు తరచు గొడవ పడుతూ ఉండేవారు.

ఇక భర్త తన భార్యను వంటలు సరిగా చేయడం లేదని, బట్టలు సరిగా ఉతకడం లేదని, చిన్నచిన్న కారణాలతోనే ఆమె తరచూ గొడవలు పెట్టుకునేవాడు. అయితే ఇదే విషయంపై పెద్ద మనుషులు పలుసార్లు అంతా ఇప్పుడు జరిపినప్పటికీ అతనిలో పెద్దగా మార్పు రాలేదు. దీనితో ఆమె లోలోపల మానసికంగా కుంగి పోయింది. దీనితో ఆమె తన భర్త పెట్టే బాధలు భరించలేక ఇంట్లోనే ఉన్న ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పర్హానా బేగం ఆత్మహత్య విషయం తెలుసుకున్న ఆమె సోదరుడు అబ్దుల్ అలీ తన చెల్లి చావుకి కారణం తన బావ వాజిద్ ఖాన్ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని మెట్ పల్లి ఎస్ ఐ సుధాకర్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.