రీఎంట్రీలో మ‌రో చిత్రం..లేడి డైనమిక్ పాత్రకు సీక్వెల్ లో విజయశాంతి నటించనున్నారా!

లేడీ డైనమిక్ యాక్షన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటారు విజయశాంతి. ఒకప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కంప్లీట్ ఎంటర్ టైనర్ గా నిలిచారు విజయశాంతి. టాలీవుడ ఇండస్ట్రీకి లేడి అమితాబ్ గా పేరు తెచ్చుకున్నారు. అదే టైమ్ లో సినీ కెరీర్ కి బ్రేక్ ఇచ్చి.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ కూడా తనదైన స్టైల్ లో రాణించారు. ఆ తర్వాత సినిమాల్లో నటించలేదు. పోయిన ఏడాది ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరూ సినిమాలో విజయశాంతి కీలక పాత్రలో నటించి.. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. తనస్టైల్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరించారు. రీఎంట్రీతో మళ్ళీ విజయశాంతి వెండితెరపై కనిపించడం ఆమె అభిమానుల్ని ఆకట్టుకున్నారు.

విజయశాంతికి, సరిలేరు నీకెవ్వరూ సినిమాలో అద్భుతమైన పాత్రను ఇచ్చారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ సినమాకు ఆమె పాత్ర హైలెట్ గా నిలిచింది. దీనికి తోడు ఆమె యాక్టింగ్ సినిమాకి ప్రాణం పోశారు. అంతేకాదు గతేడాది ఈ సినిమా సంక్రాంతి బరిలో గెలిచింది. ఈ సినిమా తర్వాత విజయశాంతికి ఎన్నో సినిమా ఆఫర్లు వచ్చాయి. కానీ ఆమె చాలా సాఫ్ట్ గా రిజెక్ట్ చేశారు. అయితే టాలీవుడ్ లో లేటెస్ట్ సమాచారం ఏంటంటే.. విజయశాంతి ఓ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తుంది.
22 ఏళ్ళ క్రితం విజయశాంతి డైనమిక్ కారెక్టర్ లో నటించిన భారతరత్న అనే సినిమాకు సీక్వెల్ గా రూపొందించబోయే సినిమాలో విజయశాంతి నటిస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

భారతరత్న సినిమాను నిర్మించిన ప్రతిమా ఫిలింస్ బ్యానర్, ఇప్పుడు కూడా అదే బ్యానర్ నిర్మిస్తుందని అంటున్నాయి సినీ వర్గాలు. ఈ వార్తలపై విజయశాంతి వైపు నుండి ఎలాంటి స్పందన లేదు. ఈ వార్తలు నిజమైతే, విజయశాంతి డైనమిక్ యాక్షన్ పాత్రలో నటిస్తారా.. లేదంటే లేడి ఒరియోంటెడ్ పాత్రకు వెన్నెముకగా నిలిచే పాత్రలో నటిస్తారా అనేది తెలియాలి. అయితే ఈ వార్తలపై ఇంకా ఎలాంటి అధికారక ప్రకటన లేదు.