Acharya Pre Release : ఇండస్ట్రీ టాక్ : లాస్ట్ మినిట్ లో “ఆచార్య” వేదిక అందుకే మార్చారా?

Acharya Pre Release : మరికొన్ని రోజుల్లో టాలీవుడ్ నుంచి మరో మోస్ట్ అవైటెడ్ సినిమా అందులోని క్రేజీ మల్టీ స్టారర్ అయినటువంటి “ఆచార్య” రిలీజ్ కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా వారసుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు ఈ చిత్రంలో కీలక పాత్రలు చేశారు.
అయితే ఈ భారీ సినిమా నుంచి మేకర్స్ మళ్ళీ అప్డేట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుండగా ఈ సినిమాపై ఒక కీలక టాక్ తాజాగా సినీ వర్గాల్లో స్టార్ట్ అయ్యింది. అదే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి గాను ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి వై ఎస్ జగన్ వస్తున్నారని. అయితే దీనిపై ప్రస్తుతానికి ఎలాంటి నిజం లేదని సమాచారం రాగా..
ఈ సినిమా ప్రీ రిలీజ్ పై మరో ట్విస్ట్ కూడా చోటు చేసుకుంది. మొదటగా ఈ సినిమాని వేడుకని ఏపీలో విజయవాడలో చాలా గ్రాండ్ గా చెయ్యాలని ఫిక్స్ చెయ్యగా తాజాగా మళ్ళీ నిర్ణయాన్ని మార్చి హైదరాబాద్ కి షిఫ్ట్ చేసినట్టుగా తెలిసింది. అయితే సడెన్ గా ఎందుకు మార్చారో అని పలు ఊహాగానాలు అయితే వినిపించడం మొదలయ్యాయి.
దీనికి కారణం బహుశా జగన్ రాకపోవడమే అని అందుకే మళ్ళీ హైదరాబాద్ లో ఫిక్స్ చేసారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి దీనిలో ఎంతమేర నిజముందో తెలియాల్సి ఉంది.
ఇక ఈ సినిమాలో కాజల్ పూజా హెగ్డే లు హీరోయిన్స్ గా నటించగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించారు. అలాగే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏప్రిల్ 29న విడుదల కాబోతుంది.