ఢీ కార్యక్రమానికి పూర్ణ దూరం కావడానికి కారణం అదేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పూర్ణ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈమె గతంలో డాన్స్ కాంపిటీషన్ కార్యక్రమం అయినా ఢీ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ అభిమానులను ఓ రేంజ్ లో అభిమానుల సందడి చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా కంటెస్టెంట్ లు చేసే ఫర్ఫార్మెన్స్ పై ప్రశంసలు కురిపిస్తూ ఏకంగా ముద్దులు పెట్టడం, హగ్ ఇవ్వడం,బుగ్గ కొరకడం చేస్తూ భారీగా ట్రోల్ అయ్యారు.

ఇకపోతే తాజాగా ప్రస్తుతం ప్రసారం కాబోతున్న ఢీ కార్యక్రమం నుంచి నుంచి ఈమె జడ్జిగా తప్పుకున్నారు. అయితే ఈమె సినిమాలతో బిజీ కావడం వల్ల ఈ కార్యక్రమం నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నట్లు గతంలో వెల్లడించారు. తాజాగా ఈ కార్యక్రమం నుంచి పూర్ణ తప్పుకోవడానికి కారణం ఏంటి అనే విషయాన్ని వెల్లడించారు. తాజాగా ఈమె ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. అదేవిధంగా రష్మి కూడా ఈ కార్యక్రమానికి యాంకర్ గా ఎంట్రీ ఇచ్చారు.

ఈ క్రమంలోనే వీరిద్దరికీ హైపర్ ఆది ఆటో రాంప్రసాద్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇకపోతే హైపర్ ఆది రష్మి, పూర్ణను ఉద్దేశిస్తూ..ఈ షోకి కొత్తగా వచ్చిన యాంకర్ ఎవరైనా మా అన్నకు హగ్గు ఇవ్వాలని చెప్పాడు. ఆ మాటకు సమాధానంగా పూర్ణ.. ఈ హగ్గులు ఇవ్వలేకే ఢీ షో వదిలేశాను. ఇక్కడ కూడా హగ్గులు అంటే ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోతాను అంటూ ఈమె షాకింగ్ కామెంట్స్ చేశారు.