శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపిస్తున్న ఆది జబర్థస్త్ చేయకపోవటం వెనుక కారణమేంటి..?

హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత ఐదు సంవత్సరాలుగా ఈ టీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా పరిచయమైన ఆది తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాడు . ఆది ఇలా బుల్లితెర మీద సందడి చేస్తూ ఒకవైపు బిగ్ స్క్రీన్ మీద కూడా తన సత్తా చాటుకున్నాడు. హైపర్ ఆది ప్రస్తుతం హీరోగా కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే కొంత కాలంగా హైపర్ ఆది జబర్దస్త్ లో కనిపించకపోవడంతో ఆది జబర్దస్త్ మానేసాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఈ విషయం గురించి అది ఎక్కడ స్పందించలేదు.

ఇదిలా ఉండగా ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో ఆది కొంతకాలం కనిపించకపోవడంతో మల్లెమాల వారితో వచ్చిన మనస్పర్థల కారణంగానే ఆది ఈటీవీలో కనిపించలేదని వార్తలు వినిపించాయి. కానీ ఈ ఆదివారం ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆది సందడి చేశాడు. ఈ ఎపిసోడ్ లో ఆది శోభనం రోజున అమ్మాయి తల్లి తండ్రులు వచ్చి శోభనం కాన్సెల్ చేస్తారు. ఆది మళ్లీ జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇస్తేనే తమ కూతురు శోభనం గదిలోకి ఎంట్రీ ఇస్తుందని కండిషన్ పెడతారు.

ఈ ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో జబర్దస్త్ లో రీ ఎంట్రీ గురించి అది ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటి వరకు జబర్దస్త్ లో చాలా చేశాను అందువల్ల కొంచెం గ్యాప్ ఇచ్చాను అని చెప్పుకొచ్చాడు. అంతే కానీ ఖచ్చితంగా జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇస్తానని ఆది చెప్పలేదు . అందువల్ల ఇకపై ఆది జబర్దస్త్ లో కనిపించే అవకాశం లేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అయినా కూడా ఇప్పటి వరకు ఆది జబర్దస్త్ మానేయటం వెనుక ఉన్న అసలు కారణం గురించి ఎక్కడా స్పందించక పోవడం గమనార్హం.