జిమ్ములో విష్ణు, జెనీలియా.. మళ్లీ అదే లుక్ ను దింపారుగా!

శ్రీను వైట్ల దర్శకత్వంలో మంచి సక్సెస్ అందుకున్న సినిమా ‘ఢీ’. ఇందులో మంచు విష్ణు, జెనీలియా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నిజానికి ఈ సినిమాల్లో వీరి కాంబినేషన్ బాగా సెట్ అయ్యింది. ఇక మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న జెనీలియా ఇప్పుడు ఎలా మారిందో అందరికీ తెలిసిందే. సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియా ద్వారా బాగా దగ్గరగా మారింది.

అయితే ఢీ సినిమా విడుదలై 15 ఏళ్ళు పూర్తి కాగా ఈ సందర్భంగా విష్ణు, జెనీలియా మళ్లీ ఢీ లుక్ తో కనిపించారు. జిమ్ములో ఇద్దరు కలిసిన సందర్భంలో చేతులు పైకెత్తి కండలు చూపించి ఆ సినిమా స్టిల్ ను చూపించారు. ఈ ఫోటోను విష్ణు షేర్ చేసుకుంటూ.. ‘నా టింకర్ బెల్ మరి నేను’ అని క్యాప్షన్ ఇచ్చాడు. జెనీలియా కూడా ఈ ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.