“విరూపాక్ష” 5 రోజుల టోటల్ బాక్సాఫీస్ వసూళ్లు.!

మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన తన రీసెంట్ చిత్రం “విరూపాక్ష” తో తన సెకండ్ లైఫ్ లో అయితే మొట్ట మొదటి భారీ హిట్ ని అందుకున్నారు. తనకి యాక్సిడెంట్ అయ్యిన తర్వాత తాను మళ్ళీ బతికి చేసిన ఇది. మరి తనతో పాటుగా ఆడియెన్స్ కూడా సాయి తేజ్ పెద్ద హిట్ కొట్టాలని కోరుకోగా అందరి సంకల్పం అయితే ఇపుడు నిజం అయ్యింది.

సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఇపుడు ఈ చిత్రం నిలిచే దిశగా కొనసాగుతుంది. సక్సెస్ ఫుల్ గా మొదటి వారాంతం కంప్లీట్ చేసుకొని మొదటి వీక్ డేస్ లోకి వచ్చి కూడా స్ట్రాంగ్ వసూళ్లు రాబడుతుంది. మరి ఈ సోమ, మంగళవారాల్లో కూడా కూడా 5 కోట్ల గ్రాస్ కి తగ్గకుండా వసూళ్లు రాబట్టడం విశేషం.

కాగా ఇప్పుడు 5 రోజుల్లో అయితే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 55 కోట్ల మాసివ్ గ్రాస్ ని అందుకుంది. దీనితో ఇప్పటివరకు ఈ చిత్రం 25 కోట్లకి పైగానే షేర్ ని రాబట్టినట్టుగా కూడా ట్రేడ్ వర్గాలు వారు చెప్తున్నారు. ఇక ఈ చిత్రంలో అయితే సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా యంగ్ దర్శకుడు కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు.

అలాగే లేటెస్ట్ గానే దర్శకుడు సుకుమార్ కూడా చిత్ర యూనిట్ మొత్తాన్ని అభినందించడం కూడా వైరల్ గా మారింది. ఇక ఫైనల్ రన్ లో అయితే విరూపాక్ష ఎక్కడ ఆగుతుందో చూడాలి.