విరాటపర్వం ప్రీ రిలీజ్ ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా స్టార్ సెలబ్రిటీస్?

హీరో దగ్గుబాటి రానా, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కలిసి నటించిన సినిమ “విరాటపర్వం “. ఈ సినిమాకీ వేణు ఊడుగుల దర్శకత్వం వహించాడు. ఒక నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకొని ఈ నెల 17 వ తేదీన విడుదల కానుంది. దీంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు జూన్ 17 వ తేదీన విరాట పర్వం సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ చాలా జోరుగా సాగుతున్నాయి.

1990 కాలంలో తెలంగాణలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా వేణు ఈ సినిమా తెరకెక్కించారు. నక్సలిజం నేపత్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రానా రావన్న పాత్రలో నటించగా .. సాయి పల్లవి వెన్నెల పాత్రలో ప్రేక్షకులకు కనిపించనుంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. విరాటపర్వం సినిమా విడుదల తేది దగ్గరపడటంతో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే ఆత్మీయ కార్యక్రమం, టీజర్ విడుదల వంటివి చేశారు. ఇక ప్రస్తుతం ఈ నెల 15 వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు.

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రముఖ టాలీవుడ్ హీరోలు విక్టరీ వెంకటేష్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూడా అతిథులుగా విచ్చేయనున్నారు. జూన్ 15 వ తేదీన హైదరబాద్ లో సాయంత్రం 6 గంటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ నీ విరాటపర్వం టీమ్ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా గురించి రానా చేసిన కామెంట్స్ వల్ల ప్రేక్షకులలో అంచనాలు పెరిగాయి. అంతే కాకుండా ఈ సినిమా టీజర్ కూడా ప్రేక్షకులను బాగ ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా మంచి హిట్ అవుతుందని విరాటపర్వం టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.