ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం దినోత్సవంపై విమర్శలు గుప్పించిన విజయసాయిరెడ్డి!

మంగళవారం రోజు ఆంధ్రప్రదేశ్ దినోత్సవ కార్యక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక దీంతో టీడీపీ నాయకులు, అధికారులు శుభాకాంక్షలు తెలుపుకుంటూ తమ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. తాజాగా ఈ కార్యక్రమం పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పలు విమర్శలు గుప్పించాడు.

ఎవరో కన్నబిడ్డకు, ఇంకెవరో బర్త్ డే సెలబ్రేట్ చేసినంత దరిద్రంగా తెలుగుదేశం దినోత్సవ ఆవిర్భవ కార్యక్రమం ఉందని అన్నాడు. అంటే దివంగత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఆవిర్భవిస్తే.. చంద్రబాబు దానిని దొంగతనంగా గుంజుకున్నాడన్న విషయం ప్రజలందరికీ తెలుసని అన్నాడు. చంద్రబాబు వేస్తున్న కపట వేషాలు చూస్తూ పైన ఉన్న ఆ పెద్దాయన ఆత్మ ఎంత క్షోభిస్తుందో అని అన్నాడు.