చెప్పినా వినకుండా ఆ మూవీ చేసి చేతులు కాల్చుకున్నాడట విజయ్ దేవరకొండ

Vijay made the meeku maathrame cheptha movie without hearing what Tarun Bhaskar said

టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా పైకొచ్చిన అతికొద్ది మంది నటులలో విజయ్ దేవరకొండ ఒకరు. మొదట్లో సహాయ నటుడిగా చిన్న పాత్రలు చేసి తర్వాత హీరోగా మారి తోలి సినిమాతోనే హిట్ కొట్టి అందర్నీ తన వైపు చూసేలా చేసాడు. రెండో సినిమా ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టి తన స్టామినా చేయించాడు. ఆ దెబ్బతో అభిమానులే కాదు విజయ్ వెనుక దర్శక నిర్మాతలు కూడా వెంటపడ్డారు.అదెయ్ ఊపులో “గీత గోవిందం” సినిమాతో వంద కోట్లు కలెక్షన్స్ సాధించాడు. మంచి స్క్రిప్ట్స్ ని సెలెక్ట్ చేసుకుంటూ సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటున్నాడు. హీరోగా కెరీర్ పీక్ స్టేజి లో ఉన్నప్పుడే నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టాడు. తన నిర్మాణ సంస్థ ద్వారా మొదటి సినిమా దర్శకుడు తరుణ్ భాస్కర్ ని హీరోగా పరిచయం చేస్తూ ‘మీకు మాత్రమే చెప్తా’ అనే సినిమాని నిర్మించాడు.

Vijay made the meeku maathrame cheptha movie without hearing what Tarun Bhaskar said
meeku maathrame cheptha movie

అయితే ఆ సినిమా యావరేజ్ టాక్ సొంతం చేసుకుని ఫైనాన్స్ పరంగా విజయ్ కి నష్టాలని మిగిల్చింది. ఇటీవల తరుణ్ భాస్కర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టాడు. ఆ సినిమా గురించి విజయ్ ప్రస్తావించినప్పుడే నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తే ఎవరు థియేటర్ కి వచ్చి చూస్తారు, పెట్టిన డబ్బులు కూడా తిరిగి రావు , ఎందుకు ఇంత రిస్క్ చేయటం అని తరుణ్ వారించాడట. అప్పుడు నువ్వు అయితేనే ఆ కథకు సరిపోతావ్ అని , దర్శకుడికి నాకు ఈ కథ మీద నమ్మకం ఉందని చెప్పి నన్ను ఈ సినిమాలో హీరోగా చేయటానికి ఒప్పించాడని ఆయన అన్నారు. చివరికి తాను అనుకున్నట్లుగానే సినిమాకి పెట్టిన మనీ కూడా తిరిగి రాలేదని తరుణ్ చెప్పారు.