కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న విజయ్.. ఆ హీరోల తర్వాత ఆ క్రెడిట్ సాధించిన రౌడీ హీరో!

ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తన టాలెంట్ తో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరో స్టేటస్ సంపాదించుకున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమా ద్వారా విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ఈ సినిమాని పూరి జగన్నాథ్ తో పాటు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి కాఫీ విత్ కరణ్ కార్యక్రమం ఇప్పటికే ఆరు సీజన్లను పూర్తి చేసుకొని ప్రస్తుతం ఏడవ సీజన్ ప్రసారమవుతుంది. అయితే ఈ సీజన్ ఇదివరకులా బుల్లితెరపై కాకుండా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమవుతుంది. ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమానికి రౌడీ హీరో విజయ్ దేవరకొండ హాజరైనట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇకపోతే ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండతో పాటు లైగర్ బ్యూటీ అనన్య పాండే కూడా హాజరయ్యారు. ఇకపోతే ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యి వారి వ్యక్తిగత విషయాల గురించి ఈ కార్యక్రమం ద్వారా బయట పెట్టారు కానీ ఇప్పటివరకు ఈ కార్యక్రమానికి సౌత్ సెలబ్రిటీలలో కేవలం బాహుబలి చిత్ర బృందం మాత్రమే హాజరయ్యారు. గతంలో రాజమౌళి, ప్రభాస్, రానా అనుష్క ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరి తర్వాత ఆ క్రెడిట్ కేవలం విజయ్ దేవరకొండకు మాత్రమే దక్కిందని చెప్పాలి.