Vijay Devarakonda: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి మనందరికీ తెలిసిందే. విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు. అందులో భాగంగానే చివరగా ది ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కింగ్ డమ్ అనే సినిమాలో నటిస్తున్నారు విజయ్ దేవరకొండ. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇది ఇలా ఉంటే తాజాగా హీరో విజయ్ దేవరకొండ గద్దర్ ఫిలిం అవార్డులపై స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024 గద్దర్ ఫిలిం అవార్డులను ప్రకటించింది.
కల్కి, లక్కీ భాస్కర్, రజాకార్ చిత్రాలకు పురస్కారాల పంట పండింది. ఉత్తమ నటుడు అల్లు అర్జున్ , పుష్ప2కి అవార్డు దక్కింది. 14 ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సినిమా పురస్కారాలను ఇవ్వనుంది. జూన్ 14న హైదరాబాద్ హైటెక్స్ లో 2024 గద్దర్ ఫిలిం అవార్డుల ప్రదానం జరగనుంది. విభజనకు కొన్నేళ్ల ముందు నుంచి సినిమా పురస్కారాలు పెండింగ్ లోనే ఉండటంతో కొద్ది నెలల కిందట అవార్డులపై తెలంగాణ ప్రభుత్వం కమిటీ వేసింది. కాగా గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. ఈ సందర్బంగా విజయ్ స్పందిస్తూ..
#GaddarTelanganaFilmAwards ❤️🙏 pic.twitter.com/c435azxzHo
— Vijay Deverakonda (@TheDeverakonda) May 30, 2025
కాంతారావు స్మారక అవార్డు ప్రకటించడం గౌరవంగా ఉంది. నట ప్రపూర్ణ కాంతారావు పేరిట ఈ గౌరవం లభించడం ఆనందంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి, జ్యూరీ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, 2016లో పెళ్లి చూపులు చిత్రానికి రెండో ఉత్తమ చిత్రంగా ఎంపిక చేసినందకు కృతజ్ఞతలు. పెళ్లి చూపులు చిత్రానికి నా హృదయంలో ఎల్లప్పుడు ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాగే ఈ గౌరవం, ఆనందం నా అభిమానులదే, వారి ప్రేమ నన్ను నడిపిస్తూనే ఉందని, నా ప్రయాణంలో తోడుగా ఉన్న కుటుంబానికి, దర్శకులకు, టీమ్ కు ధన్యవాదాలు అని విజయ్ దేవరకొండ అన్నారు. ఈ సందర్బంగా విజయ్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.