థమ్స్ అప్ క్యాన్ మీద విజయ్ దేవరకొండ ఫోటో..ఆనందంలో రౌడీ హీరో ఫ్యాన్స్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా గుర్తింపు పొందిన వారిలో విజయ్ దేవరకొండ ఒకరు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నాని ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించిన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఈ సినిమా సూపర్ హిట్ అవటంతో విజయ్ క్రేజ్ కూడా పెరిగిపోయింది. ఆ తర్వాత వచ్చిన గీత గోవిందం, టాక్సీవాలా వంటి సినిమాలు కూడా విజయం సాధించటంతో రౌడీ హీరోగా పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో నటిస్తున్నాడు.

ఇదిలా ఉండగా గత కొన్ని సంవత్సరాలుగా సాఫ్ట్ డ్రింక్స్ లో రారాజుగా నిలిచిన ఈ థమ్స్ అప్ కూల్ డ్రింక్ కి ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది. అయితే ప్రతి సంవత్సరం తమ బ్రాండ్ అని ప్రమోట్ చేసుకోవడానికి కోట్ల రూపాయలు వెచ్చించి స్టార్ హీరోలతో ఈ థమ్స్ అప్ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తుంటారు. ఇది వరకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ బ్రాండ్ ని ప్రమోట్ చేశారు. అయితే ఈ ఏడాది మహేష్ బాబు స్థానంలో థమ్స్ అప్ బ్రాండ్ ని ప్రమోట్ చేయడానికి రౌడీ హీరో విజయ్ దేవరకొండ ను ఎంపిక చేసుకున్నారు. విజయ్ దేవరకొండ తో రూపొందించిన థమ్స్ అప్ యాడ్ ప్రజలను బాగా ఆకట్టుకుంది.

అంతేకాకుండా విజయ్ దేవరకొండ కి ఉన్న ఇమేజ్ కారణంగా ఇటు తెలుగు, అటు హిందీలో కూడా ఈ థమ్స్ అప్ సాఫ్ట్ డ్రింక్ ముందంజలో ఉంది. ఇటీవల థమ్స్ అప్ స్పెషల్ ఎడిషన్ ను లాంచేసింది. ఈ థమ్స్ అప్ క్యాన్ పై రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫొటోను ముద్రించింది. దీంతో విజయ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా యూట్యూబర్, బిగ్బాస్ ఫేమ్ దేత్తడి హారిక ఇటీవల థమ్స్ అప్ స్పెషల్ ఎడిషన్ ద్వారా లాంచ్ చేసిన క్యాన్ ను కొనుగోలు చేసింది. ఈ క్యాన్ ఫోటోలను తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది.