Vijay Deverakonda: ముంబైలో ప్రారంభమైన విజయ్ దేవరకొండ లైగర్ సినిమా.?

Vijay Deverakonda: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరుచుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇక చూస్తుండగానే పాన్ ఇండియా స్టార్ గా మార్క్ ని క్రియేట్ చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇకపోతే ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న లైగర్ సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా రూపొందిస్తున్నారు పూరి జగన్నాథ్.
ఈ సినిమాకు నిర్మాతగా హీరోయిన్ చార్మి వ్యవహరిస్తున్న విషయం అందరికి తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. విజయ్ దేవరకొండ కి విపరీతమైన యూత్ లో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికి తెలిసిందే. ఇకపోతే విజయ్ దేవరకొండ తాజాగా నటిస్తున్న లైగర్ సినిమాను పూరి జగన్నాథ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్ ను ముంబైలో ప్రారంభించారు. ప్రస్తుతం ముంబైలో ఈ సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్ జరుగుతోంది.

విజయ్ దేవరకొండ తో పాటు మిగిలిన ముఖ్య తారాగణం అంతా కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొన్నారు. ఈ చివరి షెడ్యూల్తో ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తి కానున్నాయి. ఇప్పటికే మొత్తం షూటింగ్ ఫినిష్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అని చిత్రబృందం ఆలోచిస్తున్నారు. చిత్ర బృందం సినిమాను వేగవంతంగా పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా హీరో గా పరిచయం కానున్నాడు.