అభిమానుల పెళ్లి కానుకకు ఫిదా అయిన విగ్నేష్.. వీడియో వైరల్!

తాజాగా పెళ్లి బంధంతో ఒక్కటైన నయనతార విగ్నేష్ దంపతులకు పెద్దఎత్తున సోషల్ మీడియా వేదికగా అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే 19వ తేదీ కేవలం అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. వీరి వివాహానికి కొంతమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. నయనతార విగ్నేష్ దంపతులు వీరి వివాహాన్ని ప్రముఖ డిజిటల్ మీడియాకు అమ్మడంతో వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఎక్కడ బయటకు రాలేదు.పెళ్లయిన తర్వాత స్వయంగా విగ్నేష్ తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

ఈ విధంగా విగ్నేష్ పెళ్లి ఫోటోలు షేర్ చేయడంతో ఒక అభిమాని ఆ పెళ్లి ఫోటోలలో విగ్నేష్ నయనతార నుదుటిపై ముద్దు పెడుతున్న ఫోటో ఆధారంగా వారి ఇద్దరి పేర్లతో ఒక అద్భుతమైన చిత్రాన్ని చిత్రీకరించారు. ప్రస్తుతం చిత్రీకరణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన విగ్నేష్ అభిమాని కానుకకు ఫిదా అవుతూ థాంక్యూ అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ విధంగా నయనతార విగ్నేష్ పేర్లతో ఆ ఫోటోని చిత్రీకరించడానికి సుమారు 12 గంటల సమయం పట్టిందని తెలియజేశారు. కేవలం వారి పై ఉన్న అభిమానంతో ఏకంగా వారి చిత్రాలను పేర్లతో వేయడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ అభిమాని కానుక ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇకపోతే నయనతార విగ్నేష్ దంపతులు పెళ్లి చేసుకున్న మరుసటిరోజే తిరుమల స్వామివారిని దర్శించుకుని పెద్ద వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే అయితే తెలియకుండా జరిగిన తప్పుకు విగ్నేష్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.