Hero Venkatesh: బాలయ్య బాటలో పయనిస్తున్న విక్టరీ వెంకటేష్.. రియాలిటీ షోకి హోస్ట్గా రానున్న వెంకీ!

Hero Venkatesh: వెండితెరపై ఒకప్పుడు స్టార్ హీరోలుగా రాణించిన వారందరూ ప్రస్తుతం బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ మరోసారి ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి సీనియర్ హీరోలు సైతం బుల్లితెరపై పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ మొట్టమొదటిసారిగా డిజిటల్ ప్లాట్ ఫామ్ ఆహా ఓటీటీలో ప్రసారమౌతున్న అన్ స్టాపబుల్ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ మంచి గుర్తింపు పొందారు.ఈ క్రమంలోనే బాలయ్య బాటలోనే వెంకీ కూడా మరొక రియాలిటీ షోకు హోస్ట్గా చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఆహా ద్వారా సరికొత్త కార్యక్రమాలను, వెబ్ సిరీస్ లను, సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకు వస్తూ ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందిస్తున్న అల్లు అరవింద్ తాజాగా మరొక రియాలిటీ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ రియాలిటీ షో కి వ్యాఖ్యాతగా వెంకటేష్ ను తీసుకు రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అల్లు కుటుంబానికి అక్కినేని, నందమూరి కుటుంబాలతో మంచి పరిచయం ఏర్పడింది.ఈ క్రమంలోనే సరికొత్త రియాలిటీ షో ద్వారా దగ్గుబాటి కుటుంబంతో కూడా మంచి సాన్నిహిత్యం ఏర్పరచుకోవడం కోసం అల్లు అరవింద్ పెద్ద ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే వెంకటేష్ తన సినిమాల ద్వారా ఓటీటీ ప్రేక్షకులను సందడి చేసిన విషయం మనకు తెలిసిందే. అదేవిధంగా రానా నాయుడు అనే వెబ్ సిరీస్ ద్వారా మరోసారి బుల్లితెర ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే అల్లు అరవింద్ వెంకటేష్ తో ఈ విధమైనటువంటి రియాలిటీ షో ప్లాన్ చేసినట్లు పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉంది.