ఆది, నిక్కి పెళ్ళి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన వేణుస్వామి.. ఏమన్నారంటే?

తెలుగు, తమిళ భాషలలో ఎన్నో సినిమాలలో హీరో, విలన్ పాత్రలలో నటించిన ఆది పినిశెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సరైనోడు, రంగస్థలం, నిన్ను కోరి వంటి ఎన్నో తెలుగు సినిమాలలో నటించిన ఆది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఆది పినిశెట్టి ఇటీవల తన ప్రేయసి నిక్కి గల్రానీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మరకతమణి సినిమాలో కలిసి నటించిన వీరు ఆ సినిమా షూటింగ్ సమయంలో ఒకరినొకరు ఇష్టపడ్డారు. అప్పటి నుండీ ప్రేమలో ఉన్న వీరు పెద్దల అంగీకారంతో మే 18వ తేదీన వివాహబంధం తో ఒక్కటయ్యారు. మే 18 వ తేదీన చాలా ఘనంగా వివాహం జరిగింది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం ప్రముఖ జ్యోతిశ్యుడు వేణుస్వామి నిక్కి గల్రాని, ఆది పినిశెట్టి వివాహం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఆది, నిక్కి జాతకాలు పరిశీలించిన వేణుస్వామి ఆది పినిశెట్టిది ఆశ్లేష నక్షత్రమని.. ఆది నిక్కీ జాతకాలను పోల్చి చూస్తే వాళ్లవి షష్టాష్టకాలు అయ్యాయని వేణుస్వామి వెల్లడించారు. వీరిద్దరి జాతకాల ప్రకారం పెళ్ళి జరిగిన తరువాత ఇద్దరు సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది అంటూ ఆయన వెల్లడించారు. ఆది, నిక్కి భవిషత్తు గురించి నాకు అవగాహన ఉండటంతో నేనూ ఈ విషయం చెప్పాను అంటూ ఆయన చెప్పుకొచ్చారు. వీరిద్దరు విడిపోవాలని నేనూ చెప్పటం లేదు. కలిసి ఉండటానికి ప్రయత్నాలు చేయాలని ఈ విషయం చెప్పాను అంటూ వేణుస్వామి చెప్పుకొచ్చాడు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా జాతకాల ప్రభావం చాలా ఉంటుంది. జాతకాల ప్రకారం షష్టాష్టకాలు అయినప్పుడు అటువంటి వారు వివాహం చేసుకోకపోవడం మంచిది. ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న తర్వాత సమస్యల కారణంగా విడిపోయి సమాజానికి ఏం జవాబు చెబుతారు అంటూ ఆయన ప్రశ్నించారు. వీరిద్దరి జాతకాల ప్రకారం కొన్ని పరిహారాలు చేసుకోగలిగితే వీరి వైవాహిక జీవితం సజావుగా ఉంటుంది.. అంటూ వేణు స్వామి వెల్లడించాడు. సెలబ్రిటీల జాతకాల చెప్పి నిత్యం సంచలనం సృష్టించే వేణు స్వామి ఆది, నిక్కీ జాతకాల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.