Ram Charan: చరణ్ అమ్మాయిల పిచ్చోడు…. అందరి ముందు పరువు తీసిన హీరో శర్వానంద్?

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల బాలకృష్ణ హోస్టుగా వ్యవహరించిన అన్ స్టాపబుల్ కార్యక్రమానికి హాజరైన విషయం మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ రామ్ చరణ్ ని ఎన్నో రకాల ప్రశ్నలు వేశారు ముఖ్యంగా తన ఫ్యామిలీ గురించి అలాగే తన బాబాయ్ పవన్ కళ్యాణ్ గురించి కూడా ఎన్నో రకాల ప్రశ్నలు వేశారు. ఇకపోతే సెకండ్ ప్రోమో ఎపిసోడ్లో భాగంగా ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ స్నేహితుడు కూడా హాజరైన విషయం మనకు తెలిసిందే.

రామ్ చరణ్ ఇద్దరి స్నేహితులలో ఒకరు శర్వానంద్ గాక మరొక వ్యక్తిని కూడా బాలకృష్ణ ఈ వేదిక పైకి పిలిపించారు అయితే ఈ ముగ్గురితో కలిసి ఈయన ఎంతో సరదాగా మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ ముగ్గురిలో కాలేజీ చదువుతున్న సమయంలో ఎవరికి గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండేవారు అంటూ బాలకృష్ణ ప్రశ్నించడంతో వెంటనే రామ్ చరణ్ మరో స్నేహితుడు ఇద్దరు కలిసి శర్వానంద్ పేరు చెప్పారు. శర్వానంద్ కి చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారని తెలిపారు.

ఇక మీ ముగ్గురిలో ఎవరు అమ్మాయిలను ఎక్కువగా ఫ్లట్ చేసేవారు అంటూ బాలయ్య ప్రశ్నించడంతో శర్వానంద్ తోపాటు మరో స్నేహితుడు ఇద్దరు కలిసి రామ్ చరణ్ పేరును చెప్పేశారు. ఇలా రామ్ చరణ్ అమ్మాయిల పిచ్చోడు అంటూ శర్వానంద్ అందరి ముందు ఈ విషయాన్ని బయట పెడుతూ చరణ్ పరువు మొత్తం తీసేసారు. మీ ముగ్గురు ఫోన్లు ఒకసారి ఇచ్చి మీ ఫోన్ లో ఉన్న చివరి మూడు మెసేజ్లు చూపెట్టమని అడగగా.. మేము ఫోన్ తీసుకురాలేదు మర్చిపోయాం అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేయడంతో వెంటనే బాలకృష్ణ మీరు ముగ్గురు దొంగలే అంటూ సరదాగా అందరిని నవ్వించారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా శర్వానంద్ చరణ్ గొప్పతనం గురించి కూడా తెలిపారు చాలామంది ఒకరికి సహాయం చేస్తే బయటకు చెప్పుకుంటారు కానీ రామ్ చరణ్ సహాయం చేస్తే సహాయం అందుకునే వాడికి కూడా తెలియదని చరణ్ గురించి ఎంతో గొప్పగా తెలిపారు.