Road Accident: నిశ్చితార్థానికి వెళ్తూ… రోడ్డు ప్రమాదానికి గురైన యువకులు.. ఇద్దరు దుర్మరణం!

Road Accident: ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు సంభవించడం అధికమయ్యాయి. బయటకు వెళ్ళిన వాళ్ళు తిరిగి ఇంటికి వస్తారా లేదా అనే నమ్మకాలు కూడా లేకుండా పోతున్నాయి. ఈ విధంగా ప్రతి రోజూ ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతూ పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. తాజాగా ఇలాంటి రోడ్డు ప్రమాదం నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మహబూబ్‌నగర్ జిల్లా వెల్దండ మండలం అజ్ఞాపూర్ గ్రామానికి వరికుప్పల హరీశ్, సాంబశివుడు అనే ఇద్దరు యువకులు నల్గొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బామ్మర్ది నిశ్చితార్థం కోసం వీరిద్దరూ ద్విచక్ర వాహనంలో బయలుదేరగా నల్లగొండ సమీపంలోని కతాల్ గూడ వెళ్తుండగా, కొప్పోలు వద్ద బైకును ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఈ ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ విధంగా శుభకార్యానికి వెళుతున్న సమయంలో ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఇలా ఇద్దరు యువకులు మరణించడంతో రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.