ఎమ్మెల్యే రోజాకు రెండు సర్జరీలు : భర్త సెల్వమణి

Roja telugu rajyam

నగరి ఎమ్మెల్యే రోజా సర్జరీ చేయించుకున్నారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రోజాకు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగినట్లు భర్త సెల్వమణి తెలిపారు. రోజా కోలుకుంటున్నారని.. ఐసీయూ నుంచి సోమవారం వార్డుకు తరలించారని చెప్పారు. మరో రెండు వారాల పాటు రోజాకు పూర్తి విశ్రాంతి తీసుకుంటారని.. ఆమె ఆరోగ్యంపై ఆడియో టేప్ విడుదల చేశారు.

ycp mla roja comments on chandra babu naidu
ycp mla roja 

ఇది వరకే ఈ ఆపరేషన్లు నిర్వహించాల్సి ఉందని.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుటపడుతోందని.. సందర్శకులు ఎవ్వరూ ఆసుపత్రికి రావొద్దని విజ్ఞప్తి చేశారు. నగరి ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై ఎవరికీ ఆందోళన వద్దన్నారు. రోజా ఏ సర్జరీలు చేయించుకున్నారన్నది తెలియాల్సి ఉంది.

గతేడాది కరోనా, జనవరిలో ఎన్నికల కారణంగా సర్జరీలు వాయిదా వేశారని సెల్వమణి తెలిపారు. ఎమ్మెల్యే రోజా రెండు, మూడు నెలలుగా బిజీ, బిజీగా ఉన్నారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు, మార్చిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఆ హడావిడి ముగియడంతో రోజా చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో శస్త్ర చికిత్సలు చేయించుకున్నారు. వైఎస్సార్‌‌సీపీ కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేయడంతో ఆడియో టేప్ రూపంలో ప్రకటన విడుదల చేసినట్లు తెలుస్తోంది.