జూనియర్ ఎన్టీఆర్ ను రెండుసార్లు మోసం చేసిన ఇద్దరు స్టార్ డైరెక్టర్లు వీళ్లే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ కథ నచ్చితే దర్శకుడి ట్రాక్ రికార్డ్ తో సంబంధం లేకుండా అవకాశాలు ఇస్తారని ఇండస్ట్రీలో పేరుంది. ఎంతోమంది ఫ్లాప్ డైరెక్టర్లకు అవకాశాలను ఇచ్చి జూనియర్ ఎన్టీఆర్ విజయాలను ఖాతాలో వేసుకున్నారు. అయితే ఇద్దరు స్టార్ డైరెక్టర్లు మాత్రం ఎన్టీఆర్ రెండుసార్లు అవకాశాలను ఇచ్చినా ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు.

ఒక విధంగా ఆ ఇద్దరు స్టార్ డైరెక్టర్లు జూనియర్ ఎన్టీఆర్ ను రెండుసార్లు మోసం చేశారని చెప్పవచ్చు. అతనొక్కడే సినిమాతో సక్సెస్ ను అందుకున్న సురేందర్ రెడ్డి రెండో సినిమాకే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా అశోక్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాన్ని సంపాదించుకున్నారు. అయితే కథ, కథనంలోని లోపాల వల్ల అశోక్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.

అయితే అశోక్ సినిమాతో ఫ్లాప్ ఇచ్చినా తారక్ మరో ఛాన్స్ ఇవ్వగా ఊసరవెల్లి సినిమాతో మరోసారి సురేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో నిరాశపరిచారు. ఈ రెండు సినిమాలు నిర్మాతలకు కూడా భారీ నష్టాలను మిగిల్చాయి. మరో దర్శకుడు మెహర్ రమేష్ కూడా కంత్రి సినిమాతో తారక్ కు తొలి ఫ్లాప్ ఇచ్చారు. అశ్వనీదత్ ఈ సినిమాకు నిర్మాత కాగా ఈ సినిమా వల్ల నిర్మాతకు భారీగా నష్టాలు వచ్చాయి.

అయితే అశ్వనీదత్ మెహర్ రమేష్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా శక్తి అనే మరో సినిమాను నిర్మించారు. 45 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా ఫుల్ రన్ లో కేవలం 20 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది. ఈ సినిమా నిర్మాతకు 25 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. శక్తి సినిమా ఫ్లాప్ గురించి నోరు విప్పడానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ పలు సందర్భాల్లో ఇష్టపడకపోవడం గమనార్హం.