ఢిల్లీకి వెళ్లి సాధించండి అంటూ జగన్మోహన్ రెడ్డిపై సీరియస్ అయిన తులసి రెడ్డి..

తాజాగా కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి జగన్మోహన్ రెడ్డి పర్యటన పై సీరియస్ అయ్యాడు. రాష్ట్రానికి మేలు చేయాలంటే దావోస్ పర్యటన కాదు ఢిల్లీ కి వెళ్ళాలి అని అన్నాడు. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే దావోసే ఇక్కడికి వస్తుందని అన్నాడు. పరిశ్రమలను కాపాడటం అనేది ఢిల్లీ పెద్దల చేతుల్లో ఉంటే.. దావోస్ కి వెళ్లి ఒట్టి చేతులతో వచ్చాడని అన్నాడు.

ఈ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని.. ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదని.. అందుకే కాంగ్రెస్ ఏదైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని తులసి రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా మరికొన్ని విషయాలతో కూడా జగన్ ను విమర్శించాడు.