టీటీడీ మాజీ ప్ర‌ధాన అర్చ‌కులు పెద్దింటి మృతి..!

తిరుప‌తిలో క‌రోనా వైర‌స్ విర‌విహారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో క‌రోనా కార‌ణంగా తిరుమ‌ల మాజీ ప్ర‌ధాన అర్చ‌కులు పెద్దింటి శ్రీ‌నివాస‌మూర్తి దీక్షితులు సోమ‌వారం మృతి చెందారు. ఇటీవ‌ల క‌రోనా వైర‌స్ బారిన ప‌డ‌డంతో, పెద్దింటి శ్రీ‌నివాస‌మూర్తి వైద్య చికిత్స పొందుతున్నారు. ఈ క్ర‌మంలో నాలుగు రోజులుగా స్వీమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నా ఆయ‌న కోలుకోలేదు. అయితే తాజాగా ఆయ‌న‌ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచార్న‌ విషాద వార్త వ‌చ్చింది. ఇక శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులిగా సేవ‌లందించిన పెద్దింటి శ్రీ‌నివాస‌మూర్తి.. గ‌త ఏడాది ప్ర‌ధాన అర్చ‌కులు ర‌మ‌ణ‌దీక్షితుల‌తో పాటు ఆయ‌న కూడా ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. దాదాపు 35 ఏళ్ళ పాటు పెద్దింటి టీటీడీలో సేవ‌లు అందించారు. ఇక తిరుమ‌ల‌లో క‌రోనా వైర‌స్ వ్యాపించ‌డంతో అక్క‌డి అర్చ‌కుల‌కు, సిబ్బందికి క‌రోనా అంటుకుంద‌ని స‌మాచారం.