చిరంజీవి, త్రివిక్రమ్ కాంబో ఈ సారైనా సెట్టయినట్లేనా.?

మెగాస్టార్ చిరంజీవితో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. చరణ్‌ ‘వినయ విధేయ రామ’ సినిమా చేస్తున్న టైమ్‌లోనే ఈ ప్రాజెక్టు ఓకే అవుతుందనుకున్నారు. కానీ, ఇంతవరకూ ఈ కాంబో సెట్టవ్వలేదు. ఇప్పటికే చిరంజీవి డైరీ దాదాపు మూడేళ్ల వరకూ ఫుల్ అయిపోయింది. ఆయన చేయాల్సిన ప్రాజెక్టులు వరుసగా క్యూలో ఉన్నాయి.

ఇకపోతే, తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా లైన్‌లోకి వచ్చేశాడట. బాస్ కోసం బాక్సాఫీస్ దద్దరిల్లిపోయేలా ఓ కథ సిద్ధం చేసేశాడట. సైలెంట్‌గా ఈ కథను చిరంజీవికి వినిపించేశాడ కూడా. చిరంజీవికి కూడా కథ బాగా నచ్చినట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో ఈ ప్రాజెక్టు ఉండబోతోందనీ తెలుస్తోంది. అయితే, ఈ గాసిప్‌లో నిజమెంతో తెలియాలంటే ఏదో ఒక ఫంక్షన్‌లో చిరంజీవి లైట్ వేలో టంగ్ స్లిప్ అవ్వాల్సిందే. అప్పుడు ఫిక్స్ అయిపోవచ్చిక.

ఇకపోతే, చిరంజీవి నటించిన ‘ఆచార్య’ ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్‌ కోసం ‘భీమ్లానాయక్’ సినిమాకి కథ, మాటలు అందిస్తున్నసంగతి తెలిసిందే. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబుతో కమిట్ అయిన సినిమా పూర్తి చేయాల్సి ఉంది.