టాలీవుడ్ లో గత కొంత కాలంగా మంచి బ్రేక్‌ కోసం ఎదురుచూస్తున్నాడు టాలీవుడ్ యువ హీరో శ‌ర్వానంద్

ప్ర‌స్తుతం శ‌ర్వానంద్‌ పీపుల్స్ మీడియా నిర్మాణంలో కృష్ణ‌చైత‌న్యతో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో కొత్త‌గా క‌నిపించేందుకు మేకోవ‌ర్ మార్చుకునే ప‌నిలో ఉన్నాడ‌ట. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆస‌క్తిక‌ర అప్‌డేట్ ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అదే.. రాశీఖ‌న్నాతొలిసారి శ‌ర్వానంద్‌కు జోడీగా న‌టించ‌బోతుంద‌ని టాలీవుడ్ సర్కిల్ తాజా స‌మాచారం.

రాశీఖ‌న్నా ప్ర‌స్తుతం మారుతి-గోపీచంద్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌లో న‌టిస్తోంది. శ‌ర్వానంద్ అనుకున్న ప్ర‌కారం మేకోవ‌ర్ పూర్త‌యిన వెంట‌నే ఈ చిత్రం షూటింగ్ మొద‌లు కానుంద‌ట‌.

కృష్ణ‌చైత‌న్య ఇప్ప‌టికే నితిన్‌తో ప‌వ‌ర్ పేట్ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు..అయితే ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఈ ప్రాజెక్టు ర‌ద్ద‌యింది. ఇపుడిదే చిత్రాన్ని లేదా దానికి అనుబంధంగా ఉండే స్టోరీని పెట్టి శ‌ర్వానంద్‌తో సినిమా చేస్తున్నాడ‌ని టాక్!!